Medak Tour: నేడు మెదక్ జిల్లాలో ఉపరాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్, సీఎం రేవంత్రెడ్డి పర్యటన..
- నేడు మెదక్ జిల్లాలో పలువురు ప్రముఖులు పర్యటన..
- వేర్వేరు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్, సీఎం రేవంత్ పాల్గొననున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak Tour: నేడు మెదక్ జిల్లాలో పలువురు ప్రముఖులు పర్యటించనున్నారు. ఇవాళ వేర్వేరు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ లో కొల్చారం సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. సీఎం రేవంత్ తో పాటు హెలికాప్టర్ లో మెదక్ కి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ రానున్నారు.
Read also: Astrology: డిసెంబర్ 25, బుధవారం దినఫలాలు
Also Read
- Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
అక్కడి నుంచి వాహనంలో ఏడు పాయల ఆలయానికి వెళ్లి అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి మెదక్ క్యాథెడ్రిల్ చర్చిలో వందేళ్ల వేడుకలో పాల్గొని క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఒంటిగంటకు తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ పయనం కానున్నారు.
Read also: Kannappa : కనప్పపై ఆసక్తి పెంచుతున్న యానిమేటెడ్ కామిక్ బుక్ వీడియో
ఉప రాష్ట్రపతి, గవర్నర్ మెదక్ జిల్లా పర్యటన షెడ్యూల్..
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో తునికి కృషి విజ్ఞాన కేంద్రానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేరుకోనున్నారు. ఉప రాష్ట్రపతికి మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ స్వాగతం పలకనున్నారు. సేంద్రియ పంటలు పండిస్తున్న 500 మంది రైతులు, ఆసక్తి ఉన్న మరో 300 మందితో ఉపరాష్ట్రపతి మాట్లాడుతారు. సేంద్రియ పంటలు పండిస్తున్న విధానాన్ని పరిశీలించి ఎగ్జిబిషన్ తిలకించనున్నారు. సాయంత్రం 4.20 గంటలకు మెదక్ పర్యటన ముగించుకొని ఉపరాష్ట్రపతి తిరిగి హైదరాబాద్ పయనం కానున్నారు.
Read also: Ghaati : అనుష్క ‘ఘాటీ’లో మరో సర్ ప్రైజింగ్ స్టార్
నేడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా.. పోలీసులు భారీ బందోబస్తు కోసం ఇతర జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు అధికారులు. చర్చ్ వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చర్చ్ వద్దకు వాహనాలను అనుమతిని నిరాకరించారు.
IND W vs WI W: రెండో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
తాజావార్తలు
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్బ్యాగ్స్, 10.1″ టచ్స్క్రీన్.. ధర ఎంతంటే?
-
Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
-
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!