AP Crime: ప్రాణం తీసిన స్వలింగ సంపర్కం..! బయట పడుతుందనే భయంతో వ్యక్తి దారుణ హత్య
- ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య వివాదం..
- విద్యాశాఖలో పనిచేస్తున్న వ్యక్తి దారుణ హత్య..
- ప్రకాశం జిల్లాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య వివాదం కాస్తా.. ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది.. స్వలింగ సంపర్కానికి ఒప్పుకోకపోవడంతో పాటు.. నీ వ్యవహారం బయటపెడతానని వార్నింగ్ ఇవ్వడమే దీనికి కారణంగా తెలుస్తోంది.. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.. మర్రిపూడి కొండ వద్ద మండల విద్యాశాఖలో పనిచేస్తున్న కొల్ల రాజశేఖర్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.. ఈ ఘటనలో కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.
Read Also: Physical Harassment Case: క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు.. కోచ్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్
Also Read
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్తో తలపై కొట్టడంతో భర్త మృతి..
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
ఈ హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు డీఎస్పీ.. ప్రకృతికి విరుద్ధంగా మృతుడు, నిందితుడికి మధ్య స్వలింగ సంపర్క సంబంధం ఉందని.. మృతుడు కొల్ల రాజశేఖర్, నిందితుడు జగన్నాథం జయసింహకు ఇరువురు మధ్య గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఈ బంధం కొనసాగిందన్నారు.. తరుచు ఇద్దరు కలుసుకునేవారు.. అయితే, మృతుడు ఇటీవల పొదిలిలో ఒక వేడుకకు వెల్లగా అక్కడికి వెళ్లిన నిందితుడు జగన్నాథం.. స్వలింగ సంపర్కానికి ఒత్తిడి తెచ్చాడు.. రాజశేఖర్ అంగీకరించపోవడంతో.. జగన్నాథం మరింత బలవంతం చేశాడు.. ఒప్పుకోక పోగా.. నీ గే లక్షణాల గురించి నలుగురికి చెబుతానని.. దాంతో, నీకు ఇక పెళ్లి కూడా కాదని హెచ్చరించాడు.. దీంతో జగన్నాథానికి పంటలేని కోపం వచ్చింది.. అయితే, అది బయటకు ప్రదర్శించకుండా.. చివరిసారిగా నాతో ఒక్కసారి కలవాలని.. ఇకపై నిన్ను ఎప్పుడు అడగనంటూ ఈ నెల 18వ తేదీన మర్రిపూడి కొండ వద్ద రావాలని విజ్ఞప్తి చేశాడు.. అయితే, అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని.. దీంతో, నిందితుడు.. మృతుడిని కారుతో గుద్దించి పదేపదే కారుతో తొక్కించడంతో మృతుని మర్మంగాలు తెగిపోయినట్టు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ వెల్లడించారు.. ఇక, ఈ కేసులో నిందితుడి ప్రియురాలు కూడా ఉంది.. ఈ హత్యకు ప్రియురాలి సహకారం కూడా ఉండటంతో ఇరువురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు..
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!