Himachal Pradesh: విద్యార్థినిపై లైంగిక వేధింపులు, ర్యాగింగ్.. ఉసురు తీసిన ప్రొఫెసర్, తోటి స్టూడెంట్స్..
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలోని ఒక కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థిని లైంగిక వేధింపులు, ర్యాగింగ్ భూతానికి బలైంది. ప్రొఫెసర్ లైంగిక వేధింపులు, తోటి విద్యార్థినుల ర్యాగింగ్ బాధను బాధితురాలు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసింది. ప్రొఫెసర్ తనను ఎలా అనుచితంగా తాకాడనే దానితో పాటు మానసికంగా ఎలా వేధించారనే విషయాలను ఈ వీడియోలో చెప్పింది.
ధర్మశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సెప్టెంబర్ 18న హర్షిత, అకృతి, కొమోలికా అనే ముగ్గురు విద్యార్థినిలు తన కుమార్తెపై దారుణమైన ర్యాగింగ్కు పాల్పడ్డారని , ఆమెను బెదిరించారని ఆరోపించారు. కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న అశోక్ కుమార్ను కూడా ఫిర్యాదులో నిందితుల్లో ఒకరిగా పేర్కొన్నారు. ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తన మరియు మానసిక వేధింపుల కారణంగా తన కుమార్తె అధిక ఒత్తిడికి గురైందని తండ్రి ఆరోపించారు.
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- Gujarat: సూరత్లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి
Read Also: Kim Jong Un: కిమ్ తర్వాత ఉత్తర కొరియా అధికారం ఈమెదే..
డిసెంబర్ 26న లూథియానాలోని ఆస్పత్రిలో మరణించడానికి ముందు, బాధితురాలు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిందని ఆమె కుటుంబం తెలిపింది. తన కుమార్తె మరణంతో షాక్లో ఉన్న తాను ముందుగా ఫిర్యాదు చేయలేకపోయామని కుటుంబం వెల్లడించింది. తమ కుమార్తె చనిపోయే ముందు మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చూసిన తర్వాత ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నామని వారు చెప్పారు. ప్రొఫెసర్ అనుచితంగా తాకడం, క్యాంపస్లో మానసిక వేధింపుల గురించి మృతురాలు బాధను వ్యక్తం చేసింది. తాను డిసెంబర్ 20న పోలీసులు, ముఖ్యమంత్రి హెల్ప్లైన్కు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని తండ్రి వెల్లడించారు.
ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని చికిత్స పొందిన అన్ని ఆస్పత్రుల్లో విచారణ జరుగుతోంది. కాలేజ్ యాజమాన్యం ఈ ఘటనపై వేరే కథనాన్ని చెబుతోంది. సదరు మహిళ మొదటి ఏడాది ఫెయిల్ అయినప్పటికీ, సెకండ్ ఇయర్ అడ్మిషన్ కోరిందని పేర్కొంది. ఆమె తమకు ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ప్రిన్సిపాల్ రాకేష్ పఠానియా ఆరోపించారు.
తాజావార్తలు
-
MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!