Himachal Pradesh: విద్యార్థినిపై లైంగిక వేధింపులు, ర్యాగింగ్.. ఉసురు తీసిన ప్రొఫెసర్, తోటి స్టూడెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలోని ఒక కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థిని లైంగిక వేధింపులు, ర్యాగింగ్ భూతానికి బలైంది. ప్రొఫెసర్ లైంగిక వేధింపులు, తోటి విద్యార్థినుల ర్యాగింగ్ బాధను బాధితురాలు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసింది. ప్రొఫెసర్ తనను ఎలా అనుచితంగా తాకాడనే దానితో పాటు మానసికంగా ఎలా వేధించారనే విషయాలను ఈ వీడియోలో చెప్పింది.
ధర్మశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సెప్టెంబర్ 18న హర్షిత, అకృతి, కొమోలికా అనే ముగ్గురు విద్యార్థినిలు తన కుమార్తెపై దారుణమైన ర్యాగింగ్కు పాల్పడ్డారని , ఆమెను బెదిరించారని ఆరోపించారు. కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న అశోక్ కుమార్ను కూడా ఫిర్యాదులో నిందితుల్లో ఒకరిగా పేర్కొన్నారు. ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తన మరియు మానసిక వేధింపుల కారణంగా తన కుమార్తె అధిక ఒత్తిడికి గురైందని తండ్రి ఆరోపించారు.
Also Read
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Pune Murder Twist: ప్రతీ సీనూ క్లైమాక్స్..కేతన్ అగర్వాల్ మరణంలో ట్విస్టుల మీద ట్విస్టులు!
Read Also: Kim Jong Un: కిమ్ తర్వాత ఉత్తర కొరియా అధికారం ఈమెదే..
డిసెంబర్ 26న లూథియానాలోని ఆస్పత్రిలో మరణించడానికి ముందు, బాధితురాలు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిందని ఆమె కుటుంబం తెలిపింది. తన కుమార్తె మరణంతో షాక్లో ఉన్న తాను ముందుగా ఫిర్యాదు చేయలేకపోయామని కుటుంబం వెల్లడించింది. తమ కుమార్తె చనిపోయే ముందు మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చూసిన తర్వాత ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నామని వారు చెప్పారు. ప్రొఫెసర్ అనుచితంగా తాకడం, క్యాంపస్లో మానసిక వేధింపుల గురించి మృతురాలు బాధను వ్యక్తం చేసింది. తాను డిసెంబర్ 20న పోలీసులు, ముఖ్యమంత్రి హెల్ప్లైన్కు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని తండ్రి వెల్లడించారు.
ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని చికిత్స పొందిన అన్ని ఆస్పత్రుల్లో విచారణ జరుగుతోంది. కాలేజ్ యాజమాన్యం ఈ ఘటనపై వేరే కథనాన్ని చెబుతోంది. సదరు మహిళ మొదటి ఏడాది ఫెయిల్ అయినప్పటికీ, సెకండ్ ఇయర్ అడ్మిషన్ కోరిందని పేర్కొంది. ఆమె తమకు ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ప్రిన్సిపాల్ రాకేష్ పఠానియా ఆరోపించారు.
తాజావార్తలు
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!