Himachal Pradesh: విద్యార్థినిపై లైంగిక వేధింపులు, ర్యాగింగ్.. ఉసురు తీసిన ప్రొఫెసర్, తోటి స్టూడెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలోని ఒక కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థిని లైంగిక వేధింపులు, ర్యాగింగ్ భూతానికి బలైంది. ప్రొఫెసర్ లైంగిక వేధింపులు, తోటి విద్యార్థినుల ర్యాగింగ్ బాధను బాధితురాలు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసింది. ప్రొఫెసర్ తనను ఎలా అనుచితంగా తాకాడనే దానితో పాటు మానసికంగా ఎలా వేధించారనే విషయాలను ఈ వీడియోలో చెప్పింది.
ధర్మశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సెప్టెంబర్ 18న హర్షిత, అకృతి, కొమోలికా అనే ముగ్గురు విద్యార్థినిలు తన కుమార్తెపై దారుణమైన ర్యాగింగ్కు పాల్పడ్డారని , ఆమెను బెదిరించారని ఆరోపించారు. కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న అశోక్ కుమార్ను కూడా ఫిర్యాదులో నిందితుల్లో ఒకరిగా పేర్కొన్నారు. ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తన మరియు మానసిక వేధింపుల కారణంగా తన కుమార్తె అధిక ఒత్తిడికి గురైందని తండ్రి ఆరోపించారు.
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
Read Also: Kim Jong Un: కిమ్ తర్వాత ఉత్తర కొరియా అధికారం ఈమెదే..
డిసెంబర్ 26న లూథియానాలోని ఆస్పత్రిలో మరణించడానికి ముందు, బాధితురాలు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిందని ఆమె కుటుంబం తెలిపింది. తన కుమార్తె మరణంతో షాక్లో ఉన్న తాను ముందుగా ఫిర్యాదు చేయలేకపోయామని కుటుంబం వెల్లడించింది. తమ కుమార్తె చనిపోయే ముందు మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చూసిన తర్వాత ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నామని వారు చెప్పారు. ప్రొఫెసర్ అనుచితంగా తాకడం, క్యాంపస్లో మానసిక వేధింపుల గురించి మృతురాలు బాధను వ్యక్తం చేసింది. తాను డిసెంబర్ 20న పోలీసులు, ముఖ్యమంత్రి హెల్ప్లైన్కు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని తండ్రి వెల్లడించారు.
ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని చికిత్స పొందిన అన్ని ఆస్పత్రుల్లో విచారణ జరుగుతోంది. కాలేజ్ యాజమాన్యం ఈ ఘటనపై వేరే కథనాన్ని చెబుతోంది. సదరు మహిళ మొదటి ఏడాది ఫెయిల్ అయినప్పటికీ, సెకండ్ ఇయర్ అడ్మిషన్ కోరిందని పేర్కొంది. ఆమె తమకు ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ప్రిన్సిపాల్ రాకేష్ పఠానియా ఆరోపించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!