Kim Jong Un: కిమ్ తర్వాత ఉత్తర కొరియా అధికారం ఈమెదే..
- కిమ్ తర్వాత ఉత్తర కొరియా అధికారం కూతురుదే..
- తాతా, ముత్తాత సమాధుల్ని సందర్శించిన జు ఏ..
- బహిరంగ సందర్శనతో మరిన్ని ఊహాగానాలు..
- గత కొంత కాలంగా తండ్రితో పాలనతో భాగమవుతున్న జు ఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un: ఉత్తర కొరియా ఒక నిగూఢ దేశం. ఆ దేశ ప్రజలకు బయట మరో ప్రపంచం ఉందని కూడా తెలియదు. అలా అక్కడ కిమ్ జోంగ్ ఉన్ తన ఉక్కు పాలనను కొనసాగిస్తున్నారు. చిత్రవిచిత్రమైన చట్టాలు, కఠినమై రూల్స్, క్షిపణి ప్రయోగాలకు కేరాఫ్గా ఉంది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ప్రజలు, సైన్యం, అధికారులకు దైవ సమానుడు. కిమ్ మాత్రమే కాదు కిమ్ నాన్న, తాతలను కూడా ఉత్తర కొరియా గౌరవించాల్సిందే. ఎవరైనా నిరాకరిస్తే వాడి చావు జైలు లోనే.
ఇలాంటి దేశంలో వారసత్వ మార్పు గురించి జోరుగా చర్చ నడుస్తోంది. కిమ్ కుమార్తె జు ఏ తన తాతా, ముత్తాతల భౌతిక అవశేషాలు ఉన్న మౌసోలియం(సమాధిని) సందర్శించారు. తొలిసారిగా ఆమె బహిరంగంగా సందర్శించడం ఆసక్తికరంగా మారింది. శుక్రవారం ఆ దేశ స్టేట్ మీడియా ఈ చిత్రాలను చూపించింది. కిమ్ కుటుంబం దశాబ్ధాలుగా ఉత్తర కొరియనను ఉక్కు పిడికిలితో పాలిస్తోంది. ప్రస్తుతం నాయకుడు కిమ్ జోంగ్ ఉన్, తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్, తాతా కిమ్ ఇల్ సంగ్ తర్వాత దేశాన్ని పాలిస్తున్న మూడో వ్యక్తి.
Also Read
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
- Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
- Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
- Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
శాశ్వత నాయకులుగా పిలుబడే కిమ్ తండ్రి, తాతల సమాధులు రాజధాని ప్యాంగ్యాంగ్లోని కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్లో ఉన్నాయి. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) కిమ్ జోంగ్ ఉన్ ఉన్నతాధికారులతో కలిసి ప్యాలెస్ను సందర్శించినట్లు నివేదించింది. ఏజెన్సీ విడుదల చేసిన చిత్రాలలో కుమార్తె జు ఏ అతని పక్కన కనిపించింది. గతేడాది తన తండ్రితో కలిసి చైనా పర్యటనక వెళ్లింది జు ఏ. అప్పటి నుంచి ఆమె తదుపరి ఉత్తరకొరియా పాలకురాలిగా భావిస్తు్న్నట్లు దక్షిణ కొరియా గూఢచార సంస్థ తెలిపింది.
2022లో తొలిసారిగా ఆమె ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగానికి హాజరైంది. అప్పుడే జు ఏ తొలిసారిగా ప్రపంచానికి పరిచమైంది. అప్పటి నుంచి ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఆమెను ‘‘ప్రియమైన బిడ్డ’’ , ‘‘గొప్ప మార్గదర్శక వ్యక్తి’’గా సంబోధించడం ప్రారంభించింది. రాబోయే వారాల్లో జరగనున్న ఒక చారిత్రాత్మక కాంగ్రెస్లో ఆమె ఉత్తర కొరియా అధికార పార్టీలో రెండవ అత్యంత శక్తివంతమైన పదవి అయిన కేంద్ర కమిటీ మొదటి కార్యదర్శిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!