Kim Jong Un: కిమ్ తర్వాత ఉత్తర కొరియా అధికారం ఈమెదే..
- కిమ్ తర్వాత ఉత్తర కొరియా అధికారం కూతురుదే..
- తాతా, ముత్తాత సమాధుల్ని సందర్శించిన జు ఏ..
- బహిరంగ సందర్శనతో మరిన్ని ఊహాగానాలు..
- గత కొంత కాలంగా తండ్రితో పాలనతో భాగమవుతున్న జు ఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un: ఉత్తర కొరియా ఒక నిగూఢ దేశం. ఆ దేశ ప్రజలకు బయట మరో ప్రపంచం ఉందని కూడా తెలియదు. అలా అక్కడ కిమ్ జోంగ్ ఉన్ తన ఉక్కు పాలనను కొనసాగిస్తున్నారు. చిత్రవిచిత్రమైన చట్టాలు, కఠినమై రూల్స్, క్షిపణి ప్రయోగాలకు కేరాఫ్గా ఉంది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ప్రజలు, సైన్యం, అధికారులకు దైవ సమానుడు. కిమ్ మాత్రమే కాదు కిమ్ నాన్న, తాతలను కూడా ఉత్తర కొరియా గౌరవించాల్సిందే. ఎవరైనా నిరాకరిస్తే వాడి చావు జైలు లోనే.
ఇలాంటి దేశంలో వారసత్వ మార్పు గురించి జోరుగా చర్చ నడుస్తోంది. కిమ్ కుమార్తె జు ఏ తన తాతా, ముత్తాతల భౌతిక అవశేషాలు ఉన్న మౌసోలియం(సమాధిని) సందర్శించారు. తొలిసారిగా ఆమె బహిరంగంగా సందర్శించడం ఆసక్తికరంగా మారింది. శుక్రవారం ఆ దేశ స్టేట్ మీడియా ఈ చిత్రాలను చూపించింది. కిమ్ కుటుంబం దశాబ్ధాలుగా ఉత్తర కొరియనను ఉక్కు పిడికిలితో పాలిస్తోంది. ప్రస్తుతం నాయకుడు కిమ్ జోంగ్ ఉన్, తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్, తాతా కిమ్ ఇల్ సంగ్ తర్వాత దేశాన్ని పాలిస్తున్న మూడో వ్యక్తి.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
శాశ్వత నాయకులుగా పిలుబడే కిమ్ తండ్రి, తాతల సమాధులు రాజధాని ప్యాంగ్యాంగ్లోని కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్లో ఉన్నాయి. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) కిమ్ జోంగ్ ఉన్ ఉన్నతాధికారులతో కలిసి ప్యాలెస్ను సందర్శించినట్లు నివేదించింది. ఏజెన్సీ విడుదల చేసిన చిత్రాలలో కుమార్తె జు ఏ అతని పక్కన కనిపించింది. గతేడాది తన తండ్రితో కలిసి చైనా పర్యటనక వెళ్లింది జు ఏ. అప్పటి నుంచి ఆమె తదుపరి ఉత్తరకొరియా పాలకురాలిగా భావిస్తు్న్నట్లు దక్షిణ కొరియా గూఢచార సంస్థ తెలిపింది.
2022లో తొలిసారిగా ఆమె ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగానికి హాజరైంది. అప్పుడే జు ఏ తొలిసారిగా ప్రపంచానికి పరిచమైంది. అప్పటి నుంచి ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఆమెను ‘‘ప్రియమైన బిడ్డ’’ , ‘‘గొప్ప మార్గదర్శక వ్యక్తి’’గా సంబోధించడం ప్రారంభించింది. రాబోయే వారాల్లో జరగనున్న ఒక చారిత్రాత్మక కాంగ్రెస్లో ఆమె ఉత్తర కొరియా అధికార పార్టీలో రెండవ అత్యంత శక్తివంతమైన పదవి అయిన కేంద్ర కమిటీ మొదటి కార్యదర్శిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!