Shocking M*urders: “అందంగా ఉంటే అసూయ”.. కోడలు, కొడుకుతో సహా నలుగుర్ని చంపేసిన క్రూరురాలు..
- తన కన్నా అందంగా ఉంటే అసూయ..
- కోడలు, కొడుకుతో సహా నలుగురి హత్య..
- చిన్నారులనే టార్గెట్ చేసిన క్రూరురాలు..
- మేనకోడలి హత్యతో బయటపడిన హత్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking M*urders: తన కన్నా ‘‘అందం’’గా ఉంటే జీర్ణించుకోలేని మనస్తత్వం ఒక మహిళను క్రూరురాలిగా మార్చింది. చిన్న పిల్లలు అని చూడకుండా పసిపిల్లల్ని దారుణంగా హత్య చేసింది. హర్యానాలోని పానిపట్లో జరిగిన 6 ఏళ్ల చిన్నారి మరణాన్ని దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. 6 ఏళ్ల మేనకోడలిని హత్య చేసినందుకు ఒక మహిళను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎవరూ కూడా తన కన్నా అందంగా కనిపించకూడదనే భావనతోనే ఈ దారుణాలకు పాల్పడినట్లు తేలింది.
సోమవారం సోనిపట్లో కుటుంబ సభ్యులందరూ వివాహ వేడుకకు హాజరైనప్పుడు, నిందితురాలు పూనమ్ తన మేనకోడలని నీటి తొట్టిలో ముంచి చంపేసింది. పూనమ్ గతంలో 2023లో తన కొడుకుతో సహా ముగ్గురు పిల్లల్ని చంపింది. ఆమె తన మేనకోడలిలాగే వారిని కూడా నీటిలో ముంచి చంపింది.
Also Read
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
హత్య ఎలా జరిగింది?
చిన్నారి విధి సోనిపట్లో నివసిస్తోంది. తన కుటుంబంతో బంధువుల వివాహానికి హాజరుకావడానికి పానిపట్ లోని ఇస్రానా ప్రాంతంలోని నౌల్తా గ్రామానికి వచ్చింది. ఆమెతో పాటు ఆమె తాత పాల్ సింగ్, అమ్మమ్మ ఓంవతి, తండ్రి సందీప్, తల్లి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వివాహ ఊరేగింపు నౌల్తా గ్రామానికి చేరుకున్న సమయంలో ఈ హత్య జరిగింది. కుటుంబం ఊరేగింపుతో వెళ్లి పోయింది.
దీని తర్వాత విధి కనిపించడం లేదంటూ తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. కుటుంబం మొత్తం ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. దాదాపు గంట తర్వాత, ఆమె అమ్మమ్మ ఓంవతి, వారి బంధువుల ఇంటి మొదటి అంతస్తులోని స్టోర్ రూంలోకి వెళ్లింది. స్టోర్ రూం తలుపులు బయట నుంచి బోల్ట్ పెట్టి ఉంది. ఓంవంతి డోర్ తెరిచిన తర్వాత షాకింగ్ దృశ్యాన్ని చూసింది. విధి తల నీటి టబ్లో ముగిగిపోయి, కాళ్లు నేలపై ఉన్న స్థితిలో కనిపించింది. బాలికను స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసుల విచారణలో విధి అత్త పూనమ్ ఆమెను చంపినట్లు తేలింది.
అందంగా ఉంటే హత్య:
పూనమ్ తన కెంటే అందంగా ఎవరూ కనిపించకూడదని కోరుకునేదని, ఎవరైనా తన కన్నా అందంగా ఉంటే అసూయ, ఆగ్రహంతో రగిలిపోయేదని, పిల్లల్ని నీటిలో ముంచి చంపేదని తేలింది. ముగ్గురు బాలికను, సొంత కొడుకును కూడా ఇలాగే చంపినట్లే అంగీకరించింది. 2023లో పూనమ్ తన వదిన కుమార్తెను చంపింది. అదే ఏడాది అనుమానం రాకుండా ఉండటానికి తన కొడుకును కూడా నీట ముంచి చంపింది. ఈ ఏడాది ఆగస్టులో పూనమ్ సివా గ్రామంలో మరో అమ్మాయిని హత్య చేసింది.
ప్రతీ మరణమూ కూడా ఒకే విధంగా జరిగాయి. పిల్లలు లోతు లేని నీటిలో ముగినిపోయారు. ఒక కేసులో టబ్ ఒక అడుగు లోతు మాత్రమే ఉండటంతో, ఆ చిన్నారి ఎత్తు బట్టి ప్రమాదవశాత్తు మరణించే అవకాశం ఉందా అనే దానిపై దర్యాప్తు అధికారులు సందేహాలు కూడా వ్యక్తం చేశారు. తాజాగా చేసిన హత్యను పోలీసులు కేవలం 36 గంటల్లోనే ఛేదించారు. విచారణలో ప్రశ్నించగా నలుగుర్ని తానే చంపినట్లు ఆమె ఒప్పుకుంది. ముగ్గురు ఆమె బంధువులైన అమ్మాయిలు, ఆమె కొడుకు కూడా మృతుల జాబితాలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!