Fraud : లక్ష్మీదేవి పూజలతో డబ్బులు డబుల్.. తండ్రీకొడుకులకు రూ. 50 లక్షల బురిడీ..!
- లక్ష్మీ పూజల పేరుతో భారీ మోసం
- తండ్రీకొడుకుల నుంచి రూ.50 లక్షల గల్లంతు
- ఉనికిచెర్ల శివారులో ముఠా మాయ
- మూఢనమ్మకాలపై పోలీసుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అత్యాశను ఎరగా వేసి అమాయకులను దోచుకునే కేటుగాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాలో లక్ష్మీదేవి పూజల పేరుతో రూ. 50 లక్షలు కాజేసిన ఒక ముఠా ఉదంతం కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన ఒక కిలాడీ ముఠా మాయమాటలు నమ్మి, తండ్రీకొడుకులు తమ వద్ద ఉన్న భారీ మొత్తాన్ని పోగొట్టుకున్నారు.
అసలేం జరిగింది? హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులకు పరిచయమైన మహారాష్ట్ర ముఠా, తమకు కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయని నమ్మించింది. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే, దగ్గర ఉన్న నగదు రెట్టింపు (డబుల్) అవుతుందని నమ్మబలికారు. ఈ మాయమాటలకు ఆకర్షితులైన తండ్రీకొడుకులు, తమ వద్ద ఉన్న రూ. 50 లక్షలను రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ముఠాను సంప్రదించారు.
Also Read
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
- Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
మాయం చేసిన ముఠా: పథకం ప్రకారం బాధితులను ఉనికిచెర్ల శివారు ప్రాంతానికి పిలిపించుకున్న కేటుగాళ్లు, పూజల పేరుతో హడావుడి చేశారు. బాధితులు తమ వెంట తెచ్చుకున్న రూ. 50 లక్షల నగదు ఉన్న బ్యాగును ఆ ముఠా చేతికి ఇచ్చారు. పూజ ప్రక్రియలో భాగంగా బాధితుల దృష్టి మళ్లించిన ముఠా సభ్యులు, క్షణాల్లో ఆ నగదు బ్యాగుతో అక్కడి నుంచి మాయమయ్యారు. ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడంతో, తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల హెచ్చరిక: ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు, బంగారం రెట్టింపు చేస్తామంటూ వచ్చే అపరిచితులను నమ్మవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మూఢనమ్మకాలతో కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.
Jagtial: మరో బస్సు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టవేరా.. పలువురికి తీవ్ర గాయాలు
తాజావార్తలు
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!