Fraud : లక్ష్మీదేవి పూజలతో డబ్బులు డబుల్.. తండ్రీకొడుకులకు రూ. 50 లక్షల బురిడీ..!
- లక్ష్మీ పూజల పేరుతో భారీ మోసం
- తండ్రీకొడుకుల నుంచి రూ.50 లక్షల గల్లంతు
- ఉనికిచెర్ల శివారులో ముఠా మాయ
- మూఢనమ్మకాలపై పోలీసుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అత్యాశను ఎరగా వేసి అమాయకులను దోచుకునే కేటుగాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాలో లక్ష్మీదేవి పూజల పేరుతో రూ. 50 లక్షలు కాజేసిన ఒక ముఠా ఉదంతం కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన ఒక కిలాడీ ముఠా మాయమాటలు నమ్మి, తండ్రీకొడుకులు తమ వద్ద ఉన్న భారీ మొత్తాన్ని పోగొట్టుకున్నారు.
అసలేం జరిగింది? హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులకు పరిచయమైన మహారాష్ట్ర ముఠా, తమకు కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయని నమ్మించింది. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే, దగ్గర ఉన్న నగదు రెట్టింపు (డబుల్) అవుతుందని నమ్మబలికారు. ఈ మాయమాటలకు ఆకర్షితులైన తండ్రీకొడుకులు, తమ వద్ద ఉన్న రూ. 50 లక్షలను రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ముఠాను సంప్రదించారు.
Also Read
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
మాయం చేసిన ముఠా: పథకం ప్రకారం బాధితులను ఉనికిచెర్ల శివారు ప్రాంతానికి పిలిపించుకున్న కేటుగాళ్లు, పూజల పేరుతో హడావుడి చేశారు. బాధితులు తమ వెంట తెచ్చుకున్న రూ. 50 లక్షల నగదు ఉన్న బ్యాగును ఆ ముఠా చేతికి ఇచ్చారు. పూజ ప్రక్రియలో భాగంగా బాధితుల దృష్టి మళ్లించిన ముఠా సభ్యులు, క్షణాల్లో ఆ నగదు బ్యాగుతో అక్కడి నుంచి మాయమయ్యారు. ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడంతో, తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల హెచ్చరిక: ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు, బంగారం రెట్టింపు చేస్తామంటూ వచ్చే అపరిచితులను నమ్మవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మూఢనమ్మకాలతో కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.
Jagtial: మరో బస్సు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టవేరా.. పలువురికి తీవ్ర గాయాలు
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?