Gold Robbery: బంగారం, డబ్బు కోసం పట్టపగలే దారుణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Robbery: బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో దోపిడీ దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా బంగారం దోపిడీ కోసం దొంగలు ఎంతకైనా తెగిస్తున్నారు. కత్తులు, మారణాయుధాలతో దాడులు చేయడం లేదా హత్యలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. విశాఖలో పట్టపగలే రెచ్చిపోయిన ఓ దోపిడీ దొంగ మహిళను అత్యంత దారుణంగా హతమార్చాడు. అటు నెల్లూరులోనూ ఓ మహిళపై కత్తితో ఓ దోపిడీ దొంగ దాడి చేశాడు.
బంగారం, డబ్బు కోసం పట్టపగలే ఓ దుండగుడు దారుణానికి తెగించాడు. దొంగతనానికి వచ్చి ఇంట్లో ఉన్న మహిళను దారుణంగా గొంతు నులిమి హత్య చేసిన ఘటన విశాఖ నగరంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆరిలోవ పాతపోలీస్ స్టేషన్ ఎదురుగా కనకదుర్గనగర్లో కాపు రమణ, లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త రమణ జీవీఎంసీ ఉద్యాన విభాగంలో పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 9 గంటలకు ఎప్పటిలాగే విధులకు వెళ్లారు. భార్య లక్ష్మి ఒక్కరే ఇంట్లో ఉండగా ఉదయం 10 గంటలకు ఓ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఈ దృశ్యాలన్నీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చుట్టు పక్కల పరిసరాలను పరిశీలించి వెళ్లిపోయాడు.
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
IND vs NAM: ఇషాన్ కిషన్ మెరుపులు.. హార్దిక్ ఫినిషింగ్ టచ్! నమీబియాకు భారీ టార్గెట్
తర్వాత మళ్లీ 11 గంటల సమయంలో నెత్తిపై టోపీ, ముఖానికి మాస్క్ ధరించి ఎవరికి కనపడకుండా వచ్చాడు. ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న లక్ష్మిపై దాడిచేసి గొంతునులిమి ప్రాణం తీశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు ఆభరణాలు, బీరువాలో ఉన్న రూ.5 లక్షల నగదును తీసుకుని పారిపోయాడు. ఈమెను హత్య చేసిన విషయం కనీసం ఇరుగు పొరుగు వారికి కూడా తెలీయనీయకుండా దొంగతనానికి వచ్చిన దుండగుడు హత్య చేసి పారిపోయాడు.
ఉదయం డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం 5గంటలకు ఇంటికొచ్చి భార్యను పిలిచాడు. ఎంత పిలిచినా స్పందించలేదు. ఎలాంటి స్పందన భార్య నుంచి లేకపోయే సరికి కంగారు పడ్డాడు. వెంటనే లోపలికి వెళ్లి చూసేసరికి భార్య విగత జీవిగా పడి ఉంది. ముక్కులో నుంచి రక్తం వచ్చి ఉండటం గమనించారు భర్త. భార్య చనిపోవడంతో షాక్కు గురై బిగ్గరగా అరవడంతో స్థానికులు చేరుకున్నారు. భార్య ఒంటిమీద బంగారం, బీరువాలో నగదు లేకపోవడంతో కుమార్తె, కుమారుడు, అల్లుడికి తెలిపారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు అంబులెన్స్ పంపించారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే లక్ష్మి మరణించినట్లు తెలిపారు. క్లూస్ టీం ఘటనా స్థలిలో ఆధారాలను సేకరించింది.
బాగా రెక్కీ నిర్వహించిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. భర్త రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతురాలి కుమార్తె, కుమారుడు, బంధువులు అక్కడికి సమీపంలో నివాసం ఉంటున్నా సాయంత్రం వరకు ఆమె మృతిచెందిన విషయం గుర్తించలేకపోయారు.
Ishan Kishan: ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్.. అరుదైన ఘనత కొట్టేశాడుగా!
మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రభుత్వ టీచర్ మీద ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. ఒంటి మీద ఉన్న నగలు లాక్కెళ్లాడు. గూడూరుకు చెందిన ప్రభుత్వ మహిళ ఉపాధ్యాయురాలు హరిత.. బాలాయపల్లి మండలం గోట్టిగాడి గ్రామంలో ఉండే ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. ప్రతి రోజూ గూడూరు నుంచి ఆమె స్కూలుకు వెళ్లి వస్తుంటుంది. ఈ క్రమంలో గూడూరు నుంచి పాఠశాలకు వెళ్లేందుకు బస్ సమయానికి లేకపోవడంతో గూడూరులోని అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద వెంకటరమణయ్య అలియాస్ చిన్న అనే వ్యక్తికి చెందిన ఆటో ఎక్కింది.
ఆటోలో హరిత ఒక్కరే ఉండటంతో.. ఆమె మెడలో ఉండే నగలు మీద ఆటో డ్రైవర్ కన్నేశాడు. బెదిరించి.. భయపెట్డి.. లేదంటే చంపి అయినా నగలు దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్కూల్కి వెళ్తున్న క్రమంలో బాలాయపల్లి సమీపంలోకి వెళ్లగానే కత్తితో బెదిరించాడు. మెడలో ఉండే నగలు ఇవ్వాలని.. లేదంటే చంపేస్తానని భయపెట్టాడు. ఈ సమయంలో హరిత ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె మెడ మీద కత్తితో గాటు పెట్టాడు. ఇదే సమయంలో అతనికి కూడా రక్త గాయాలు అయ్యాయి. అనంతరం మెడలో ఉండే చైన్ తీసుకుని అక్కడి నుంచి అతను పరారయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న హరిత జరిగిన విషయాన్ని తోటి టీచర్స్ కి ఫోన్ చేసి చెప్పారు. వారు హాస్పిటల్ కి తరలించారు.
AP Students AI Wonder: ఏపీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.. ఇంటి నుండే పోలీస్ కంప్లైంట్..!
హరితకు గొంతు మీద తీవ్ర గాయాలు అవ్వడంతో నెల్లూరులోని ఓ ప్రవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటో డ్రైవర్ వెంకట రమణయ్యను మూడు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నగలు రికవరీ చేయడంతో పాటు ఆటోని సీజ్ చేశామని వెల్లడించారు పోలీసులు. మొత్తానికి బంగారం కోసం దోపిడీ దొంగలు చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. ఐతే ఇలాంటి దోపిడీ దొంగలు బెయిల్పై బయటకు రాకుండా.. కఠిన శిక్షలు అమలు చేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
-
Mark Zuckerberg: జుకర్బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
-
US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..