AP Crime: ఏపీలో మరో దారుణం.. వివాహితపై నలుగురు యువకుల సామూహిక అత్యాచారం.. ఆపై హత్య..!
- కడియంలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం..
- వివాహిత అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు..
- బుర్రిలంకకు చెందిన నర్సరీ మహిళా కూలీ రౌతు కస్తూరి...
- గత నెల 15న చొప్పెల్ల లాకుల వద్ద అనుమానాస్పద మృతి..
- పోస్టుమార్టం రిపోర్ట్లో సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియంలో వివాహిత అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన నర్సరీ మహిళా కూలీ రౌతు కస్తూరి.. గత నెల 15న చొప్పెల్ల లాకుల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే, ఆమె పోస్టుమార్టం రిపోర్ట్లో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలింది.
Read Also: Matangi : ఇండియన్ నేవీకి కొత్త ఆయుధం.. సిబ్బంది లేకుండా 600కి.మీ ప్రయాణించిన ‘మాతంగి’
Also Read
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత అత్యాచారం, హత్య కేసుగా నమోదు చేసిన కడియం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుర్రిలంకకు చెందిన దేవర యేసులోకి జయప్రసాద్, వెలుబుడి ప్రవీణ్, పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరంతా మద్యం మత్తులో ఆమెపై క్రూరంగా లైంగికదాడి చేసి ఆ తర్వాత హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుపై మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. చొప్పెల్ల లాకులు వద్ద మృతదేహం లభించాక అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేసి విచారించడంతో.. కామాంధుల డొంక కదిలింది. దీనిపై అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపంగా భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. భర్త ఫిర్యాదుపై మొదట మిస్సింగ్ కేసు, మృతదేహం లభించిన తర్వాత అనుమానస్పద మృతి కేసు, పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత హత్య కేసుగా నమోదు చేసి కడియం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!