Palnadu Crime: చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు.. తండ్రీకొడుకుల కిడ్నాప్, హత్య
- పల్నాడు జిల్లాలో దారుణం..
- తండ్రీకొడుకుల కిడ్నాప్, హత్య..
- చెక్ బౌన్స్ కేసులో కోర్టు హాజరైన సమయంలో కిడ్నాప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palnadu Crime: పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది.. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు అయినా తండ్రీకొడుకులను దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా సంతమగులూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం చాలా ఏళ్లుగా బెంగుళూరులో స్థిరపడ్డారు.. అయితే, కొడుకు ప్రశాంత్ రెడ్డికి, తండ్రి వీరస్వామి రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములతో వివాదాలు వచ్చాయి.. ఇరువురికి చెందిన చెక్బుక్ తోసుకొని ప్రత్యర్థి భాగస్వాములు గడ్డం అనీల్ కుమార్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని ఒంగోలు, అద్దంకి, నరసరావుపేట.. ఇలా పలు ప్రాంతాలలో చెక్బౌన్స్ కేసులు వేశాడట..
Read Also: Heavy Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..! 4 రోజులు ఏపీలో భారీ వర్షాలు..
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
అయితే, ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజు నరసరావుపేటలో కోర్టులో వాయిదాల నిమిత్తం బెంగుళూరు నుండి వచ్చారు ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి.. నరసరావుపేట కోర్టు సమీపంలో ఉన్న హోటల్ కి వెళ్లి టిఫిన్ తిని బయటికి వస్తున్న ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి పై గడ్డం అనీల్ రెడ్డి మరియు కొందరు వ్యక్తులు విరుచుకుపడ్డారు.. వారిని కిడ్నాప్ చేశారు.. ఇద్దరిని బాపట్ల జిల్లా సంతమగులూరు గ్రామ పరిధిలోని ఓ ప్రైవేట్ వెంచర్లో దారుణంగా హత్య చేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు గడ్డం అనీల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.. ప్రధాన అనుమనితుడుగా ఉన్న బాదం మాధవ రెడ్డి.. 2014 నుంచి 2017 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి ఇంఛార్జ్గా పనిచేశారు.. అయితే, తండ్రీకొడుకుల హత్యకు వ్యాపార లావాదేవీలే ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.. హత్యకు పాల్పడిన వారు, హత్య చేసిన వారు సంతమగులూరు మండలానికి చెందిన చిన్న ముఠా సభ్యులుగా సమాచారం..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!