Palnadu Crime: చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు.. తండ్రీకొడుకుల కిడ్నాప్, హత్య
- పల్నాడు జిల్లాలో దారుణం..
- తండ్రీకొడుకుల కిడ్నాప్, హత్య..
- చెక్ బౌన్స్ కేసులో కోర్టు హాజరైన సమయంలో కిడ్నాప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palnadu Crime: పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది.. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు అయినా తండ్రీకొడుకులను దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా సంతమగులూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం చాలా ఏళ్లుగా బెంగుళూరులో స్థిరపడ్డారు.. అయితే, కొడుకు ప్రశాంత్ రెడ్డికి, తండ్రి వీరస్వామి రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములతో వివాదాలు వచ్చాయి.. ఇరువురికి చెందిన చెక్బుక్ తోసుకొని ప్రత్యర్థి భాగస్వాములు గడ్డం అనీల్ కుమార్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని ఒంగోలు, అద్దంకి, నరసరావుపేట.. ఇలా పలు ప్రాంతాలలో చెక్బౌన్స్ కేసులు వేశాడట..
Read Also: Heavy Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..! 4 రోజులు ఏపీలో భారీ వర్షాలు..
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
అయితే, ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజు నరసరావుపేటలో కోర్టులో వాయిదాల నిమిత్తం బెంగుళూరు నుండి వచ్చారు ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి.. నరసరావుపేట కోర్టు సమీపంలో ఉన్న హోటల్ కి వెళ్లి టిఫిన్ తిని బయటికి వస్తున్న ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి పై గడ్డం అనీల్ రెడ్డి మరియు కొందరు వ్యక్తులు విరుచుకుపడ్డారు.. వారిని కిడ్నాప్ చేశారు.. ఇద్దరిని బాపట్ల జిల్లా సంతమగులూరు గ్రామ పరిధిలోని ఓ ప్రైవేట్ వెంచర్లో దారుణంగా హత్య చేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు గడ్డం అనీల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.. ప్రధాన అనుమనితుడుగా ఉన్న బాదం మాధవ రెడ్డి.. 2014 నుంచి 2017 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి ఇంఛార్జ్గా పనిచేశారు.. అయితే, తండ్రీకొడుకుల హత్యకు వ్యాపార లావాదేవీలే ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.. హత్యకు పాల్పడిన వారు, హత్య చేసిన వారు సంతమగులూరు మండలానికి చెందిన చిన్న ముఠా సభ్యులుగా సమాచారం..
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!