Sangareddy Crime: లారీని వెనుకనుంచి ఢీకొట్టిన బైక్.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి
- నాందేడ్- అఖోలా నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..
- లారీని వెనుక నుంచి ఢీకొట్టిన బైక్- ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి..
- కంది మండలం తునికిళ్ళ తండా వద్ద ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్- అఖోలా నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని వెనుక నుంచి బైక్ ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కంది మండలం తునికిళ్ళ తండా వద్ద జరిగింది.
Read also: KCR : నేడు తెలంగాణ బడ్జెట్.. ప్రతి పక్షనేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్..?
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
కంది మండలం తునికిళ్ళ తండా వద్ద లారీని ఒక పక్కకు లారీని ఆపాడు డ్రైవర్. వర్షం కురుస్తుండటంతో పక్కకు లారీని పక్కకు ఆపి కాసేపు తరువాత బయలు దేరుదామని అనుకున్నాడు. ఇంతలోనే లారీ వెనుక నుంచి పెద్ద శబ్దం. ఏమైందని లారీ డ్రైవర్ కిందికి దిగి చూసే సరికి యుగ్గురు యువకులు లారీ వెనుకల రోడ్డుపై చెల్లా చెదురై పడి వున్నారు. డ్రైవర్ షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. కానీ పోలీసులు చేరుకునే సరికి ముగ్గరు యువకులు అప్పటికే మృతి చెందారు. అయితే డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశారు.
ఈ ముగ్గురు యువకులు అతి వేగంతో బైక్ నడపడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతి చెందిన ముగ్గురు యువకులు కందిలోని అక్షయ పాత్ర కిచెన్ లో పని చేస్తున్నట్లు గుర్తించారు. మృతులు పుల్కల్ మండలం ఇసాజి పేట, గంగోజిపేట వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కొరకు సంగారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను ఈ సమాచారం అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అసలే వానాకాలం ఈపరిస్థితుల్లో వాహనదారులు దారుల్లో వెల్లేప్పుడు జాగ్రత్తగా బండ్లను నడపాలని సూచించారు. వర్షాకాలంలో వాహనాలు స్పీడ్ గా నడపరాదని, రోడ్డుపై నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా నడపాలని తెలిపారు. రోడ్డులపై పక్కకు వాహనాలు ఉంటాయని దానిని గమనించి ప్రయాణించాలని సూచించారు.
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. పోలవరం విషయంలో కీలక చర్చ
తాజావార్తలు
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
-
Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
-
ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!