Crime: ‘‘దృశ్యం’’ తరహా మర్డర్.. ప్రియుడితో కలిసి భర్తను చంపి, వంటింటిలో పూడ్చిపెట్టిన భార్య..
- అహ్మదాబాద్తో దృశ్యం తరహా మర్డర్..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- మృతదేహాన్ని వంటింటిలో పాతిపెట్టిన నిందితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: వెంకటేష్ నటించిన సూపర్ హిట్ ఫిలిం ‘‘దృశ్యం’’ తరహాలో ఒక మర్డర్ జరిగింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ మహిళ తన భర్తను చంపేసి, వంటింటిలో పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడు, అతడి స్నేహితుడి సహాయంతో భర్తను చంపేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఇంటిలోని వంటగదిలో నేల కింద పూడ్చిపెట్టింది. నిందితులు హత్య చేసినట్లు ఒప్పుకున్న తర్వాత అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఘటనా స్థలం నుంచి అస్థిపంజర అవశేషాలను వెలికితీశారు.
Read Also: Malaika Arora : నచ్చిన వాళ్లతో శృంగారం చేస్తే తప్పేంటి.. నటి షాకింగ్ కామెంట్స్
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
పోలీసులు నివేదిక ప్రకారం, సర్ఖేజ్ ప్రాంతంలోని ఫతేవాడి కెనాల్ నివాసి అయిన 35 ఏళ్ల సమీర్ అన్సారీ ఒక సంవత్సరం నుండి కనిపించకుండా పోయాడు. అతని భార్య రూబీ, ఆమె ప్రియుడు ఇమ్రాన్, ఇద్దరు స్నేహితులు సాహిల్, ఫైజు సహాయంతో సమీర్ హత్యకు కుట్ర పన్నింది. ఇమ్రాన్తో రూబీకి ఉన్న సంబంధం గురించి తెలిసిన సమీర్ తరుచూ ఆమెతో గొడవపడేవాడు. అది చివరకు హత్యకు దారి తీసినట్లు పోలీసులు వెల్లడించారు. సమీర్ మిస్సింగ్పై మూడు నెలల క్రితం క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. అతడి మొబైల్ ఫోన్ 14 నెలలుగా స్విచ్ ఆఫ్ అయి ఉంది. అతను స్నేహితులతో, బంధువులతో మాట్లాడలేదు.
విచారణ జరపగా, ఇమ్రాన్తో అక్రమ సంబంధం వెలుగులోకి రావడంతో పోలీసులకు లీడ్ దొరికింది. విచారణలో ఇమ్రాన్, రూబీతో కలిసి సమీర్ను హత్య చేసినట్లు అంగీకరించారు. వంటింటి నుంచి సేకరించిన అస్థిపంజర అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. తన భర్త పని కోసం దుబాయ్ వెళ్లాడని చెప్పేదని, ఇమ్రాన్తో తరుచుగా కనిపించేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు. హత్య తర్వాత కొన్ని నెలలు ఇంట్లోనే ఉన్న రూబీ, ఆ తర్వాత ఇంటిని వేరే వారికి అద్దెకిచ్చింది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో అద్దెకు ఉన్న వారు ఇంటిని ఖాళీ చేసి వెళ్లారు. ఇది పోలీసులు విచారణకు సహకరించింది. ప్రస్తుతం ఇమ్రాన్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రూబీ, సాహిల్,ఫైజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
-
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!