ఢిల్లీ అతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సారి భారీగా వజ్రాలు పట్టుబడ్డాయి. రోజు రోజుకు కేటుగాళ్లు మితిమీరిపోతున్నారు. అధికారుల కంటబడకుండా ఉండేందుకు కొత్తకొత్త విధంగా విలువైన వస్తువులనై అక్రమంగా తరలిస్తున్నారు. అయితే తాజాగా హాంగ్కాంగ్ నుంచి ఢిల్లీకి ఎయిర్పోర్ట్కు వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్లో కస్టమ్స్ అధికారులు భారీగా వ్రజాలను గుర్తించారు.
అధికారులకు దొరక్కుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్స్లో వజ్రాలు ప్యాకింగ్ చేసి స్కానింగ్లో తెలియకుండా ఉండేందుకు కార్బన్ పేపర్ను చుట్టారు. అయితే అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆ ప్రయాణికుడి బ్యాగ్ను తనిఖీ చేయగా సుమారు 1.5 కోట్ల విలువ చేసే 5 వేల వజ్రాలు పట్టుబడ్డాయి. ఈ మేరకు సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు వజ్రాలను సీజ్ చేశారు.
