Delhi Firing: రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ.. 52 ఏళ్ల వ్యక్తిపై కాల్పులు
- బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడి చనిపోయిన 52 ఏళ్ల వ్యక్తి
- కారులో వచ్చి రత్తన్ పై కాల్పులు జరిపిన దుండగులు
- మృతుడి శరీరం నుంచి 69 బుల్లెట్లు తీసిన వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర స్థాయికి చేరడంతో 52 ఏళ్ల వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన ఘటన దక్షిణ ఢిల్లీలో కలకలం రేపింది. అయా నగర్ ప్రాంతంలో నవంబర్ 30 తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో రత్తన్ లోహియా అనే వ్యక్తి బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడి శరీరం నుంచి మొత్తం 69 బుల్లెట్లు వెలికితీసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, నవంబర్ 30 ఉదయం రత్తన్ లోహియా తన పనికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో ముందుగా అక్కడే వేచి ఉన్న దుండగులు కారులో వచ్చి అతన్ని చుట్టుముట్టి వరుసగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో రత్తన్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనేక ఖాళీ బుల్లెట్ షెల్స్తో పాటు మూడు లైవ్ కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ముగ్గురు దుండగులు అయా నగర్లో రత్తన్ కోసం కారులో వేచి ఉన్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కారుకు నంబర్ ప్లేట్లు ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు భారతదేశం వెలుపల ఉన్న గ్యాంగ్స్టర్ల ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, రత్తన్ లోహియా కుటుంబ సభ్యులు ఈ హత్య వెనుక రాంబీర్ లోహియా మరియు అతని బంధువుల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. రాంబీర్ కుమారుడు అరుణ్ హత్యకు ప్రతీకారంగానే ఈ ఘటన జరిగిందని వారు పేర్కొంటున్నారు. గత మే 15న అరుణ్ తన కారులో ఇంటికి వెళ్తుండగా, మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ కేసులో రత్తన్ లోహియా పెద్ద కుమారుడు దీపక్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు హత్యలు పరస్పర ప్రతీకార చర్యలుగా జరిగి ఉండవచ్చని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!