Delhi Firing: రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ.. 52 ఏళ్ల వ్యక్తిపై కాల్పులు
- బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడి చనిపోయిన 52 ఏళ్ల వ్యక్తి
- కారులో వచ్చి రత్తన్ పై కాల్పులు జరిపిన దుండగులు
- మృతుడి శరీరం నుంచి 69 బుల్లెట్లు తీసిన వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర స్థాయికి చేరడంతో 52 ఏళ్ల వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన ఘటన దక్షిణ ఢిల్లీలో కలకలం రేపింది. అయా నగర్ ప్రాంతంలో నవంబర్ 30 తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో రత్తన్ లోహియా అనే వ్యక్తి బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడి శరీరం నుంచి మొత్తం 69 బుల్లెట్లు వెలికితీసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, నవంబర్ 30 ఉదయం రత్తన్ లోహియా తన పనికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో ముందుగా అక్కడే వేచి ఉన్న దుండగులు కారులో వచ్చి అతన్ని చుట్టుముట్టి వరుసగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో రత్తన్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనేక ఖాళీ బుల్లెట్ షెల్స్తో పాటు మూడు లైవ్ కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Pune Murder Twist: ప్రతీ సీనూ క్లైమాక్స్..కేతన్ అగర్వాల్ మరణంలో ట్విస్టుల మీద ట్విస్టులు!
- Tragedy: ఫోటోలకు పోజులిస్తూ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..
- Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
- Ketan Agarwal Case: అమ్మో ‘సియా’.. సోనమ్ కంటే జిత్తులమారి.. నవ్వుతో చక్కబెట్టేసింది
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ముగ్గురు దుండగులు అయా నగర్లో రత్తన్ కోసం కారులో వేచి ఉన్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కారుకు నంబర్ ప్లేట్లు ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు భారతదేశం వెలుపల ఉన్న గ్యాంగ్స్టర్ల ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, రత్తన్ లోహియా కుటుంబ సభ్యులు ఈ హత్య వెనుక రాంబీర్ లోహియా మరియు అతని బంధువుల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. రాంబీర్ కుమారుడు అరుణ్ హత్యకు ప్రతీకారంగానే ఈ ఘటన జరిగిందని వారు పేర్కొంటున్నారు. గత మే 15న అరుణ్ తన కారులో ఇంటికి వెళ్తుండగా, మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ కేసులో రత్తన్ లోహియా పెద్ద కుమారుడు దీపక్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు హత్యలు పరస్పర ప్రతీకార చర్యలుగా జరిగి ఉండవచ్చని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
-
Disha Patani : ప్రాణ స్నేహితులకు కన్నీటి వీడ్కోలు.. ఇన్స్టాలో దిశా ఎమోషనల్ పోస్ట్ వైరల్
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..