Dehradun: డెహ్రాడూన్ కారు ప్రమాదంలో వెలుగులోకి దారుణమైన అంశాలు!
- డెహ్రాడూన్ కారు ప్రమాదంలో వెలుగులోకి దారుణమైన అంశాలు!
- మృతదేహాల నుంచి వేరైనా తలలు.. నుజ్జునుజ్జు అయిన శరీరాలు
- పట్టించుకోని తల్లిదండ్రలు.. పోలీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యుక్త వయసులో మంచి, చెడులు ఆలోచించే వివేచన ఉంటుంది. జీవితం ముందుకు సాగాలన్నా.. పాడు చేసుకోవాలన్నా.. యవ్వనమే టర్నింగ్ పాయింట్ అవుతోంది. ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసినా జీవితాలను చేజేతులారా నాశనం చేసుకున్న వాళ్లు అవుతారు. ఇదంతా ఎందుకంటారా? ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ కారు ప్రమాదం తర్వాత ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది. అసలేమైంది? డెహ్రాడూన్ కారు ప్రమాదం ఎలా జరిగింది? మృతదేహాలు శిరచ్ఛేదం ఎలా చేయబడ్డాయో తెలియాలంటే ఈ వార్త చదవండి.
సిద్ధేష్ అగర్వాల్ (25) అనే యువకుడు టయోటా ఇన్నోవా కొత్త కారు కొనుగోలు చేశాడు. దీంతో తన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేశాడు. ఏడుగురు స్నేహతులు బాగా మద్యం సేవించారు. పార్టీ పూర్తి చేసుకున్న తర్వాత మంగళవారం (నవంబర్ 12) అర్ధరాత్రి 1:30కి సమయంలో లాంగ్ డ్రైవ్కు రెడీ అయ్యారు. విపరీతమైన వేగంతో గాల్లో దూసుకుపోతున్నారు. నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు బాగా మద్యం సేవించి ఉన్నారు. అత్యంత వేగంగా దూసుకెళ్లడంతో నగరంలోని ఓఎన్ జీసీ చౌక్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టారు. అంతే కారు నుజ్జునుజ్జు అయిపోయింది. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు అక్కడికక్కడే ఛిద్రం అయిపోయారు. కారు పైటాప్ లేచి పోవడంతో మృతదేహాలు శిరచ్ఛేదనం అయ్యాయి. ఆరుగురు తలలు లేకుండా పోయాయి. అంతేకాకుండా శరీరాలు కూడా గుర్తు పట్టలేనంతగా నుజ్జునుజ్జు అయిపోయాయి. సిద్ధేష్ అగర్వాల్ మాత్రం తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులు కునాల్ కుక్రేజా (23), అతుల్ అగర్వాల్ (24), రిషబ్ జైన్ (24), నవ్య గోయెల్ (23), కామాక్షి (20), గునీత్ (19)గా గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన కుక్రేజా మినహా అందరూ డెహ్రాడూన్కు చెందినవారే.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Krishna Deer Hunting : కృష్ణ జింకల వేట.. ముగ్గురు నిందితుల అరెస్ట్..!
- Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
ఇదిలా ఉంటే ఇంత ఘోరమైన ప్రమాదం జరిగి పిల్లలు చనిపోతే.. ఇప్పటి వరకు తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదన్న వార్తలు వినిపిస్తు్న్నాయి. అంతేకాకుండా పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ట్రక్కు డ్రైవర్ది తప్పులేదని తేల్చారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి కేసు కూడా నమోదు చేయలేదని సమాచారం. ఇదిలా ఉంటే యువతీ, యువకులు పార్టీ చేసుకున్న దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Tags
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!