NTV Telugu Site icon

DB Stock Broking Scam: హైదరాబాద్‌లో రూ. 7,000 కోట్ల విలువైన స్టాక్‌బ్రోకింగ్ కుంభకోణం..

Db Stock Broking Scam

Db Stock Broking Scam

DB Stock Broking Scam: హైదరాబాద్‌లో రూ. 7,000 కోట్ల విలువైన స్టాక్‌బ్రోకింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. డిబి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తమను మోసం చేసిందంటూ సైబరాబాద్ లో ఫిర్యాదులు చేశారు. అధిక మొత్తంలో నష్టమోయామంటూ పెద్దమొత్తంలో ఫిర్యాదులు చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు.. డిపి స్ట్రాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్ తో పాటు పలువురుపై కేసులు నమోదు చేశారు. స్టాక్ బ్రోకింగ్ ద్వారా డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందాయి. కేవలం హైదరాబాదులోనే 20 వేల మంది డిబి స్టాక్ బ్రోకింగ్ బాధితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు షాక్ కు గురయ్యారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గౌహతి, నల్బరితో సహా ప్రధాన నగరాల్లో కార్యాలయాలను కలిగి ఉన్న డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన బాధితుల నుండి ఫిర్యాదులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

 సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షమై పంచాక్షర్ రూ.11 లక్షలు..

హైదరాబాద్‌లోని పుప్పాలగూడ మణికొండకు చెందిన 37 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షమై పంచాక్షర్ అనే వ్యక్తి సెప్టెంబర్ 23న ఫిర్యాదు చేశాడు. అసోంలోని గౌహతికి చెందిన దీపాంకర్ బర్మన్‌కు చెందిన డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు లాభాలు, అసలు మొత్తం వడ్డీ చెల్లింపులు కూడా తిరిగి చెల్లించలేదు దీనిపై పంచాక్షర్ కేసు నమోదు చేశారు. 2018లో DB స్టాక్ బ్రోకింగ్ పెట్టుబడులు ప్రారంభించింది. అధిక వడ్డీ రాబడితో పథకాలను అందించడం ద్వారా వేలాది మంది కస్టమర్లను ఆకర్షించింది. వీటిలో 120% వడ్డీని అందించే వార్షిక ప్లాన్, 54% అందించే సెమీ-వార్షిక ప్లాన్ మరియు 7% అందించే నెలవారీ ప్లాన్ వంటి ఎంపికలు ఉన్నాయి. అయితే, జూలై 2024 నుండి చెల్లింపులు ఆగిపోయాయని పెట్టుబడిదారులు వాపోయారు.

హైదరాబాద్ లో డిబి స్టాక్ బ్రోకింగ్..

హైదరాబాద్‌లోని కెపిహెచ్‌బి కాలనీలో డిబి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా మంది స్థానిక ప్రజలు డిబి స్టాక్ బ్రోకింగ్ ను నమ్మి ఈ పథకంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. ఈ స్కామ్‌తో జగదీష్‌ అనే వ్యక్తి కూడా వున్నట్లు స్థానికులు తెలిపారు. లక్షల నుంచి కోట్ల వరకు నష్టపోయినట్లు వెల్లడిస్తూ బాధితులు ముందుకు వచ్చారు. ఈస్కామ్ లో విశ్వజిత్ సింగ్ కంపెనీలో రూ. 36.8 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అతనికి మొత్త పెట్టుబడి రాలేదు. కేవలం రూ. 16.2 లక్షల వడ్డీ చెల్లింపును పొందాడు. అదే విధంగా, 2022 డిసెంబర్‌లో రూ. 88.5 లక్షలు పెట్టుబడి పెట్టిన గంటాడి హరీష్ పాక్షిక వడ్డీ చెల్లింపును అందుకున్నాడు, కానీ ఇప్పటికీ తన అసలు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో సహా ఇతర బాధితులు ఇంకా అధికారికంగా ఫిర్యాదులు చేయలేదు కానీ రాబోయే రోజుల్లో ముందుకు వస్తారని పోలీసులు భావిస్తున్నారు.

Hong Kong Sixes Tournament: హాంకాంగ్ సిక్సెస్‌లో టీమిండియా.. టోర్నీ రూల్స్ భలే ఉన్నాయే! తప్పక తెలుసుకోవాల్సిందే