Drishyam Real Incident: దృశ్యం సినిమా స్ఫూర్తితో.. ప్రియుడితో కలిసి తండ్రిని చంపింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daughter Killed Her Father With Help Of Mother And Lover: చిన్నప్పటి నుంచి అల్లారముద్దుగా పెంచి, ప్రయోజకురాల్ని చేసిన కన్నతండ్రిని కడతేర్చింది ఓ కూతురు. కేవలం తన ప్రేమకి అడ్డొస్తున్నాడనే నెపంతో.. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. మరో దారుణం ఏమిటంటే.. ఈ హత్యకు తల్లి కూడా సహకరించింది. ఆపై దృశ్యం సినిమా తరహాలో.. ఇద్దరూ డ్రామా ఆడారు. చివరికి అడ్డంగా దొరికిపోయారు. సభ్యసమాజం తలదించుకొనే ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బెళగావిలో నివాసముంటున్న సుధీర్ కాంబళె (57), రోహిణి దంపతులకు స్నేహ అనే కుమార్తె ఉంది. పూణెలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న సమయంలో ఆమెకు అక్షయ్ విఠకర్ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. అయితే.. కుమార్తె ప్రేమ విషయం తండ్రి సుధీర్కి తెలిసింది. దీంతో ఆయన మందలించాడు. అతనికి దూరంగా ఉండమని హెచ్చరించాడు. తండ్రి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం చూసి, తన ప్రేమ ఎప్పటికీ సఫలం కాదని స్నేహ భావించింది. దాంతో, ఆయన్ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తల్లి రోహిణికి చెప్పగా.. చెంప ఛెళ్లుమనిపించాల్సింది పోయి, సరేనని ఆమె ప్లాన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పుడు తల్లి, కూతురు, ఆమె ప్రియుడు కలిసి.. సుధీర్ హత్యకు ప్లాన్ చేశారు. ఈనెల 15న అక్షయ్ను బెళగావికి రప్పించి, ఓ లాడ్జిలో ఉంచారు.
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
ప్లాన్ ప్రకారం.. 16న తండ్రి సుధీర్ గాఢ నిద్రలో ఉండగా, 17న తెల్లవారుజామున అక్షయ్ను ఇంటికి పిలిపించింది. తల్లీకూతుళ్లు సుధీర్ కాళ్లు, చేతులు పట్టుకోగా.. అక్షయ్ కత్తితో పొడిచి చంపేశాడు. సుధీర్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక, అక్షయ్ తిరిగి పూణె వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన భర్తని ఎవరో హత్య చేశారంటూ రోహిణి పోలీసులకు సమాచారం అందించింది. అంతకుముందే, పోలీసులు ఏం ప్రశ్నించినా దృశ్యం సినిమాలోలాగే ఒకే సమాధానం ఇవ్వాలని స్కెచ్ వేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు.. తల్లీకూతుళ్లను ప్రశ్నించారు. వాళ్లు ఒకే రకమైన సమాధానాలు ఇవ్వడంతో, పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వాళ్లు తమదైన శైలిలో విచారించగా.. హత్య చేసింది తామేనని ఒప్పుకున్నారు. అక్షయ్ సహా తల్లికూతుళ్లని అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి పంపించారు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?