NTV Telugu Site icon

Delhi: “స్నేహం” కోసం 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్..

Police

Police

Delhi: ఢిల్లీలో ఓ స్కూల్ క్యాబ్ డ్రైవర్ అదే స్కూల్‌లో చదువుతున్న 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఢిల్లీలోని సంసద్ మార్గ్ లోని ప్రముఖ పాఠశాలలో చదువుతోంది. నవంబర్ 3న బాలిక పాఠశాలకు హాజరుకాలేదు. ఈ విషయం గురించి పాఠశాల యాజమాన్యం నుంచి బాలిక తండ్రికి సమాచారం అందింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో క్యాబ్ డ్రైవర్‌పై అనుమానంతో కాల్ చేయగా.. అతను లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం మరింత బలపడింది.

క్యాబ్ డ్రైవర్ లోకేషన్‌కి సంబంధించిన వివరాలను పోలీసులు గుర్తించారు. డ్రైవర్ బాలికను బంగ్లా సాహిబ్ గురుద్వారా సమీపంలో దించేసి పరారీలో ఉన్నాడు, ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.

Read Also: Dharmana Prasada Rao: 75 ఏళ్ల తర్వాత మార్పు వచ్చింది.. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడింది..

గతంలో నిందితుడి క్యాబ్ లోనే బాలిక పాఠశాలకు వెళ్లేది. బాలికపై డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో, అతనే స్వయంగా కూతురును పాఠశాలలో డ్రాప్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో నవంబర్ 3న ఆమెను స్కూల్ గేటు వద్ద దింపిన సమయంలో, క్యాబ్ డ్రైవర్ క్షమాపణ చెబుతాననే నెపంతో బాలికను పిలిచి క్యాబ్ లో బలవంతంగా కూర్చోబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. క్యాబ్ డ్రైవర్ బాలికతో స్నేహం చేయాలని అనుకున్నాడని, కిడ్నాప్ చేసి బాలికతో కలిసి పారిపోయేందుకు యత్నించి పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.