Real Estate Cheating: రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో ప్రజలకు టోకరా వేసిన బ్రదర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvanagiri Police Arrested Brothers In Fake Real Estate Business Case: అడ్డదారిలో డబ్బులు దోచుకునేందుకు దొంగలు పన్నే పన్నాగాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా.. ట్రెండ్కి తగ్గట్టే పావులు కదుపుతుంటారు. ఆయా పరిస్థితుల్లో దేనికైనా మార్కెట్లో డిమాండ్ ఉంటుందో, దాన్నే అస్త్రంగా మార్చుకొని ప్రజలకు టోకరా వేస్తుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు బ్రదర్స్ అలాంటి మోసానికే పాల్పడ్డారు. అక్కడ రియల్ ఎస్టేట్కు మంచి గిరాకీ ఉందన్న విషయం తెలుసుకొని, ఆ బిజినెస్నే అడ్డం పెట్టుకొని కోట్లకు పడగలెత్తారు. తీరా వీరి బండారం బయటపడటంతో, పోలీసులు రంగంలోకి దిగి బడిత పూజ చేశారు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో రియల్ ఎస్టేట్కు డిమాండ్ బాగా ఉండడంతో.. సయ్యద్ సైఫ్, సయ్యద్ సమీర్ అనే సోదరులు ఫేక్ బిజినెస్ ప్రారంభించారు. తక్కువ రేట్లకు స్థలాలు అందిస్తామని చెప్పి.. ప్రజల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారు. తీరా తాము మోసపోయామన్న సంగతి తెలుసుకున్న ప్రజలు.. ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 24 మంది ఫిర్యాదు చేయడంతో, ఈ కేసుని పోలీసులు సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ బ్రదర్స్ని అదుపులోకి తీసుకొని, రిమాండ్కి తరలించాం. ఆ సోదరులిద్దరు ప్రజల నుంచి ఐదు నుంచి ఆరు కోట్ల దాకా వసూలు చేసినట్లు విచారణలో తేలిందని భువనగిరి ఏసీపీ వెంకట్ రెడ్డి వెల్లడించారు.
Also Read
- Ketan Agarwal Case: అమ్మో ‘సియా’.. సోనమ్ కంటే జిత్తులమారి.. నవ్వుతో చక్కబెట్టేసింది
- Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
ఆ బ్రదర్స్ వద్ద నుంచి తాము రూ. 80 లక్షల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నామని వెంకట్ రెడ్డి తెలిపారు. రెండు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, 29 తులాల బంగారం, రెండు మారుతి కార్లు, నాలుగు ద్విచక్ర వాహనలు, ఒక కేటీఎమ్ బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, ఓ కంప్యూటర్ని స్వాధీనం చేసుకొని.. వాటిని సీజన్ చేసినట్లు ఏపీసీ చెప్పారు. ఫేక్ బిజినెస్ మాయాజాలంలో పడొద్దని, ఇలాంటి దోపిడీదారులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒకటికి రెండుసార్లు కన్ఫమ్ చేసుకున్నాక ముందడుగు వేయాల్సిందిగా సలహా ఇచ్చారు.
తాజావార్తలు
-
India – Iran Talks: ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై కీలక చర్చలు.. భారత్ తదుపరి అడుగు ఏంటి?
-
CM Revanth Reddy : RDS నీళ్లపై తెలంగాణ మాస్టర్ ప్లాన్.!
-
Swiggy Instamart: స్విగ్గీ ఇన్స్టామార్ట్లో రాజీనామాల బాంబ్ .. ఒకేసారి సీఓఓ, సీబీఓల రిజైన్ ! అసలేం జరుగుతుంది?
-
Air India: పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. డ్రెస్సింగ్ రూమ్లోకి నో ఎంట్రీ..
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!