Uttarapradesh: ఛీ.. ఛీ.. నువ్వు అస్సలు తల్లివేనా.. ముగ్గురు పిల్లలను చంపి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ తల్లి ఆ పేరుకే మచ్చను తీసుకొచ్చింది.. కన్న పేగును కూడా మరచి ముగ్గురు పిల్లలను అతి దారుణంగా హత్య చేసి బావిలో పడేసింది.. ఆ తర్వాత తాను కూడా తన ఇంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేసింది..కేకలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలను ఆర్పివేశారు. మంటలు ఆర్పిన తర్వాత ముగ్గురు పిల్లలను బావిలో పడేసినట్లు తల్లి చెప్పింది.. ఈ ఘటన పై పోలీసులకు సమాచారం అందగా అక్కడికి చేరుకొని మహిళను అరెస్ట్ చేశారు..
వివరాల్లోకి వెళితే.. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ ప్రాంతంలో జరిగింది.. మిర్జాపూర్ జిల్లా సంత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పజ్రా గ్రామంలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో సుధ అనే వివాహిత తన భర్త అమర్జీత్తో ఫోన్లో మాట్లాడింది. భర్త ముంబైలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఫోన్లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఏదో వాగ్వాదం జరిగింది. అయితే కోపంతో రగిలిపోయిన తల్లి పిల్లలను బావిలో పడేసింది..ఆ తర్వాత తాను ఇంటికి తాళం వేసి నిప్పాంటించుకుంది.. అది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు ఆమెను కాపాడారు…
Also Read
ఇక పిల్లల మృతదేహాలను గ్రామస్థుల సహాయంతో బంధువులు బావిలో నుంచి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పగా..మా ఇద్దరికీ అస్సలు మాటలు లేవని చెప్పాడు.. వీరికి తరచూ వాగ్వాదాలు జరిగేవనీ, అలాంటి ఓ వాదన సమయంలో ఆ మహిళ కోపంతో ఈ తీవ్ర చర్య తీసుకుందని తెలిపారు..మృతదేహలను పోస్ట్ మార్టం కు పంపించి ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!