Hyderabad Crime: పాతబస్తీలో దారుణ హత్య.. కళ్లలో కారం నీళ్లు చల్లి కాల్పులు..
- పాతబస్తీలో దారుణ హత్య..
- బాలాపూర్లో రౌడీషీటర్ రియాజ్ను కాల్చి చంపిన దుండగులు..
- కళ్లలో కారం నీళ్లు చల్లి కాల్పులు..
- వెలుగులోకి రౌడి షీటర్ చాకు నజీర్ తో మృతుడు రియాజ్ మధ్య గొడవలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: పాతబస్తీ బాలాపూర్లో గ్యాంగ్స్టర్ రియాజ్ పై కాల్పులు కలకలం రేపాయి. బాలాపూర్లోని ఏఆర్సీఐ రోడ్డులో రియాజ్పై గుర్తు తెలియని దుండగుల మూడు రౌండ్ల కాల్పులు చేసి హత్య చేశారు. దీంతో రియాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు. మృతుడు రియాజ్ ను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి బుల్లెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రాత్రి 10 గంటలకు రియాజ్ పై కాల్పులు చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య ముందు.. హత్య జరిగిన తరువాత ఏ వాహనాలు ఈ రూట్ వైపు వెళ్లాయని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలపూర్ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి హత్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read also: CM Revanth Reddy: నేడు గూగుల్, అమెజాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
గతంలో పలు హత్య కేసుల్లో పలు నేరాల్లో గ్యాంగ్ స్టర్ రియాజ్ ప్రమేయం వుందని పోలీసులు వెల్లడించారు. రౌడి షీటర్ చాకు నజీర్ తో మృతుడు రియాజ్ మధ్య గొడవలు వున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫజల్ అనే రౌడీ షీటర్ మర్డర్ కేసులో మృతుడు రియాజ్ A5 గా నిందితుడుగా తెలిపారు. ఫజల్ అనే రౌడీ షీటర్ హత్య వల్లే నజీర్ గ్యాంగ్ రియాజ్ ను టార్గెట్ చేసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇది పాత కక్షలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రియాజ్ ను చంపింది నజీర్ గ్యాంగ్ గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఆధారాలు ఇంకా తెలియాలని అన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే కారంతో కలిపిన నీళ్లు రియాజ్ కళ్ళలో చల్లి రియాజ్ పై పిస్టల్ తో రౌడి షీటర్ చాకు నజీర్ గ్యాంగ్ కాల్పులు జరిపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లారిటీ కోసం ఈ కేసుపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన రాచకొండ ఎస్ఓటి & హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రౌడి షీటర్ చాకు నజీర్ గ్యాంగ్ అదుపులో తీసుకుని దర్యాప్తు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన రద్దు.. ఫేక్ ప్రచారం నమ్మొద్దు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!