Hyderabad Crime: పాతబస్తీలో దారుణ హత్య.. కళ్లలో కారం నీళ్లు చల్లి కాల్పులు..
- పాతబస్తీలో దారుణ హత్య..
- బాలాపూర్లో రౌడీషీటర్ రియాజ్ను కాల్చి చంపిన దుండగులు..
- కళ్లలో కారం నీళ్లు చల్లి కాల్పులు..
- వెలుగులోకి రౌడి షీటర్ చాకు నజీర్ తో మృతుడు రియాజ్ మధ్య గొడవలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: పాతబస్తీ బాలాపూర్లో గ్యాంగ్స్టర్ రియాజ్ పై కాల్పులు కలకలం రేపాయి. బాలాపూర్లోని ఏఆర్సీఐ రోడ్డులో రియాజ్పై గుర్తు తెలియని దుండగుల మూడు రౌండ్ల కాల్పులు చేసి హత్య చేశారు. దీంతో రియాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు. మృతుడు రియాజ్ ను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి బుల్లెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రాత్రి 10 గంటలకు రియాజ్ పై కాల్పులు చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య ముందు.. హత్య జరిగిన తరువాత ఏ వాహనాలు ఈ రూట్ వైపు వెళ్లాయని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలపూర్ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి హత్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read also: CM Revanth Reddy: నేడు గూగుల్, అమెజాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
గతంలో పలు హత్య కేసుల్లో పలు నేరాల్లో గ్యాంగ్ స్టర్ రియాజ్ ప్రమేయం వుందని పోలీసులు వెల్లడించారు. రౌడి షీటర్ చాకు నజీర్ తో మృతుడు రియాజ్ మధ్య గొడవలు వున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫజల్ అనే రౌడీ షీటర్ మర్డర్ కేసులో మృతుడు రియాజ్ A5 గా నిందితుడుగా తెలిపారు. ఫజల్ అనే రౌడీ షీటర్ హత్య వల్లే నజీర్ గ్యాంగ్ రియాజ్ ను టార్గెట్ చేసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇది పాత కక్షలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రియాజ్ ను చంపింది నజీర్ గ్యాంగ్ గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఆధారాలు ఇంకా తెలియాలని అన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే కారంతో కలిపిన నీళ్లు రియాజ్ కళ్ళలో చల్లి రియాజ్ పై పిస్టల్ తో రౌడి షీటర్ చాకు నజీర్ గ్యాంగ్ కాల్పులు జరిపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లారిటీ కోసం ఈ కేసుపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన రాచకొండ ఎస్ఓటి & హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రౌడి షీటర్ చాకు నజీర్ గ్యాంగ్ అదుపులో తీసుకుని దర్యాప్తు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన రద్దు.. ఫేక్ ప్రచారం నమ్మొద్దు..
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!