Kolkata: కోల్కతాలో మరో ఘోరం.. అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న చిన్నారిపై అకృత్యం
- పశ్చిమ బెంగాల్లో మరో దారుణం..
- రాత్రి అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక అపహరణ..
- నిద్రిస్తుండగా చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేసిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో మరో దారుణం జరిగింది. రాత్రి అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక చోరీకి గురైంది. అనంతరం ఆ చిన్నారి లైంగిక వేధింపులను ఎదుర్కొందని పోలీసులు చెప్పారు. స్థానిక బంజారా కమ్యూనిటీకి చెందిన ఒక మహిళ తన మనుమరాలితో పాటు తారకేశ్వర్లోని రైల్వే షెడ్లో నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అని హుగ్లీ రూరల్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
Read Also: IPL 2026-CSK: ఐపీఎల్ 2026 వేలంకు ముందే సంచలనం.. సీఎస్కేలోకి సంజు, జడేజా ఔట్!
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
అయితే, చిన్నారిపై దాడికి పాల్పడిన వ్యక్తి మంచంపై నుంచి బాలికను ఎత్తుకుపోయాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మర్నాటి మధ్యాహ్నం ఆ చిన్నారి తారకేశ్వర్ రైల్వే హై డ్రెయిన్ సమీపంలో తీవ్ర గాయాలతో, రక్తపు మడుగులో పడి ఉంది. పాప నా పక్కన నిద్రపోతుండగా.. తెల్లవారుజామున పాపను ఎవరో లాక్కుపోయారని చెప్పింది. తమ ఇళ్లను కూల్చివేయడంతో వీధుల్లో నివసించాల్సిన పరిస్థితి వచ్చింది, తాము ఎక్కడికి వెళ్లాలని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. కాగా ఈ కేసులో పోలీసులు ఆ బాలిక తాత రాజు దాస్ ను అరెస్టు చేశారు.
Read Also: CM Revanth Reddy: 60 వేల పైచిలుకు ఉద్యోగాలు.. 20 వేల నియామక నోటిఫికేషన్లు ఇచ్చాం..
ఇక, ప్రస్తుతం బాధిత చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో.. తారకేశ్వర్ గ్రామీణ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. కాగా, పాక్పో చట్టం కింద ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం గురించి తెలియగానే బీజేపీ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కార్ పై విమర్శలు చేసింది. తారకేశ్వర్లో నాలుగేళ్ల బాలికపై రేప్ జరిగితే.. బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకుండా.. ఆ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నారని ఆరోపించింది. ఇది మమతా బెనర్జీ స్వేచ్ఛాయుత పాలనను గుర్తు.. ఒక చిన్నారి జీవితం నాశనం అయిందని బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
తాజావార్తలు
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!