Nagpur Acid Attack: పెళ్లైన మగాడి కోసం.. తల్లికొడుకులపై యువతి యాసిడ్ దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
25 Year Old Woman Arrested For Throwing Acid On Lover Wife: తమ ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో, అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ దాడులు చేసిన సంఘటనల్ని మనం ఎన్నో చూశాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో అందుకు భిన్నంగా దాడి చేసింది. ఆల్రెడీ పెళ్లైన ఓ మగాడితో ఎఫైర్ పెట్టుకున్న ఒక యువతి.. అతని భార్య, కొడుకుపై యాసిడ్ దాడి చేసింది. ఈ దాడిలో వాళ్లిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఈ ఘటన.. తీవ్ర కలకలం రేపుతోంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. నాగ్పూర్లోని వినోబా భావే నగర్లో శనివారం సాయంత్రం ఓ మహిళ తన రెండున్నరేళ్ల కొడుకుని ఎత్తుకొని, ఇంటి ముందే నడుస్తోంది. అదే సమయంలో ఒక స్కూటీలో బుర్ఖా వేసుకున్న ఇద్దరు మహిళలు వచ్చారు. సరిగ్గా ఆ మహిళ వద్దకు రాగానే.. వెనుక సీట్లో కూర్చున్న 25 ఏళ్ల యువతి, తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్ను ఒక్కసారిగా ఆ తల్లికొడుకులపై పోసింది. ఈ ఘటనలో తీవ్రంగా తల్లికొడుకు తీవ్రంగా గాయపడ్డారు. ఆ యువతి మళ్లీ ఎక్కడా తమపై యాసిడ్ దాడి చేస్తుందన్న భయంతో.. తల్లి తన కొడుకుని తీసుకొని వెంటనే ఇంట్లోకి పరిగెత్తింది. మరోవైపు.. స్కూటీలో వచ్చిన ఆ ఇద్దరు అమ్మాయిలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
దాడి చేసిన యువతి.. బాధితురాలి భర్త మాజీ ప్రియురాలని తేలింది. పెళ్లికి ముందు ఆ మహిళ భర్తతో ఆ యువతి ప్రేమాయణం కొనసాగించింది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో వాళ్లు పెళ్లి చేసుకోలేదు. అయితే.. అతనికి పెళ్లైనా ఆ యువతి అతనితో రిలేషన్షిప్ కంటిన్యూ చేసింది. ఈ విషయం భార్యకు తెలియడంతో.. ఆమె యువతిని నిలదీసింది. తన భర్తని కలవొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఆ కోపంతోనే ఆ యువతి ఈ దాడికి పాల్పడినట్టు తేలింది. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ లొకేషన్ ఆధారంగా.. పోలీసులు ఆ యువతిని అరెస్ట్ చేశారు. అయితే.. ఈ యువతికి మద్దతు ఇచ్చిన యువతి మాత్రం పరారీలో ఉంది. ఆమె కోసం గాలిస్తున్నారు.
ఈ ఘటనపై యశోద నగర్ పోలీసులు మాట్లాడుతూ.. ‘‘దాడి చేసిన యువతి, బాధితురాలి భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై బాధితురాలు, నిందితురాలి మధ్య కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కూడా వీరి మధ్య గొడవ జరగడంతో.. నిందితురాలు పగ పెంచుకుంది. తన స్నేహితురాలి సహాయంతో.. బాధితురాలు, ఆమె కుమారుడిపై యాసిడ్ దాడి చేసింది. బాధితులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నాం. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి’’ అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
-
RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
-
Kitchen Hygiene: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు!
-
EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!