Zomato: ఫుడ్ లవర్స్కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zomato: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే నెటిజన్ల జేబులకు చిల్లు పెట్టే సరికొత్త ఎత్తుగడకు ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో (Zomato) శ్రీకారం చుట్టింది. ఇప్పటికే డెలివరీ ఛార్జీలు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఫీజులు, ప్లాట్ఫామ్ ఫీజులు, జీఎస్టీల పేరుతో వినియోగదారులను పిండేస్తున్న కంపెనీ.. ఇప్పుడు ఏకంగా నగదు చెల్లింపులపై కూడా పన్ను మోత మొదలుపెట్టింది. క్యాష్-ఆన్-డెలివరీ ఆర్డర్ (COD) చేసే కస్టమర్లపై ప్రత్యేకంగా అదనపు బాదుడు విధించడం మొదలుపెట్టి షాక్ ఇచ్చింది. సాధారణంగా ఆన్లైన్ మోసాలకు భయపడో, ముందస్తు చెల్లింపులు ఇష్టం లేకో చాలామంది క్యాష్-ఆన్-డెలివరీ ఆప్షన్ను ఎంచుకుంటారు. అయితే ఇకపై ఇలా ఆర్డర్ చేసే వారి బిల్లుల్లో “పే ఆన్ డెలివరీ ఫీజు” పేరిట సరికొత్త ఛార్జీని జొమాటో యాడ్ చేస్తోంది. ఆర్డర్ విలువ, యూజర్, లోకేషన్ను బట్టి ఈ ఛార్జీ ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. అయితే తీవ్రమైన పోటీ ఉన్న స్విగ్గీ వంటి సంస్థలు ఇప్పటికీ సీవోడీపై ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకపోవడం గమనార్హం.
చిన్న రుసుము.. వందల కోట్ల లాభం
కస్టమర్ దృష్టిలో చూస్తే ఒక్క ఆర్డర్పై రూ.5 లేదా రూ.10 పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ జొమాటో సామ్రాజ్యం ముందు ఈ చిన్న మొత్తం కళ్లు చెదిరే లాభాలను తీసుకొస్తుంది. గణాంకాల ప్రకారం జొమాటో ప్రతిరోజూ దాదాపు 23 లక్షల నుంచి 25 లక్షల ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. ఒకవేళ కేవలం ప్రతి ఆర్డర్పై రూ.5 అదనంగా వసూలు చేసినా.. సంస్థ ఖాతాలోకి రోజూ దాదాపు రూ.1.25 కోట్లు, ఏడాదికి సుమారు రూ.450 కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చి పడుతుంది. ఈ సంఖ్యే ఈ మైక్రో-ఛార్జీల వెనుక దాగి ఉన్న అసలు సూత్రమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read
- UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ...ఇదే భారతీయుల దుస్థితి!
రూ.2తో మొదలై రూ.15కు చేరిన ప్లాట్ఫామ్ దోపిడీ
ఫుడ్ యాప్లు యూజర్లను ఎలా అలవాటు చేసి బాదుతాయో ప్లాట్ఫామ్ ఫీజు ప్రస్థానాన్ని చూస్తే అర్థమవుతుందని అంటున్నారు. 2023 ఏప్రిల్లో కేవలం రూ.2 నామమాత్రపు ఫీజుతో మొదలైన ఈ దోపిడీ.. ఇప్పుడు ఆర్డర్కు రూ.14.99 (జీఎస్టీ అదనం) వరకు చేరింది. ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు కేవలం ఈ ప్లాట్ఫామ్ ఫీజుల ద్వారానే ఏడాదికి దాదాపు రూ.3,500 నుంచి రూ.4,000 కోట్ల భారీ ఆదాయాన్ని పిండుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా పేమెంట్ మోడ్పై కూడా ఫీజు వేయడంతో ఫుడ్ బిల్లుల జాబితా చాంతాడంత పొడవుగా తయారవుతోంది. తిండి ఖర్చు పక్కన పెడితే ప్యాకేజింగ్, డెలివరీ, ప్లాట్ఫామ్, పేమెంట్, ట్యాక్స్ అంటూ అన్ని రకాల ఛార్జీలతో తయ నెత్తిన పెద్ద బండ వేస్తున్నారని యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Zomato: ఫుడ్ లవర్స్కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!