Eggs Prices: ఆకాశాన్ని అంటుతున్న ‘‘కోడిగుడ్డు’’ ధరలు.. కారణాలు ఏంటి?, ఎప్పుడు తగ్గుతాయి?
- రూ.8కి చేరిన కోడిగుడ్డు ధరలు..
- డిసెంబర్ - జనవరి మధ్య పీక్ డిమాండ్..
- ఫిబ్రవరి నుంచి కాస్త తగ్గే అవకాశం..
- దాణా, రవాణా ఖర్చులతో కోడిగుడ్డు ధరలపై ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eggs Prices: గతంలో రూ. 6, రూ. 7 లకు దొరికే ‘కోడిగుడ్డు’ ధర ఇప్పుడు రూ. 8కి చేరింది. అయితే, ఇలా ఎందుకు పెరుగుతున్నాయని సాధారణ వినియోగదారుడి మదిలో ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో, నగరాల్లో ఎగ్స్ రేట్లు పెరిగాయి. దీనికి ముఖ్యంగా, చలి కాలమే కారణమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్-జనవరి మధ్య గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో ప్రొటీన్ రిచ్ ఫుడ్స్కు డిమాండ్ ఉంటుంది. స్కూల్ హాస్టల్స్, రోడ్ సైడ్ తిరుబండారాల షాపులు, ఇళ్లలో గుడ్ల వినియోగం పెరిగింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కోడిగుడ్ల రేట్లు జనవరి చివరి వరకు ఇలాగే ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి డిమాండ్ తగ్గుతుంది. దీంతో ధరలు కూడా దిగి వచ్చే అవకాశం ఉంది. అయితే, గతంలోలాగా రూ. 5 లేదా రూ. 6కు ఎగ్స్ వచ్చే పరిస్థితి మాత్రం ఉండచపోచ్చు. ఇతర ప్రొటీన్ పుడ్స్తో పోలిస్తే ఎగ్స్ అందరికి అందుబాటులో ఉంటాయి. దీంతోనే వీటికి డిమాండ్ అధికంగా ఉంది.
Also Read
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
సరఫరా పెరిగినా, సరిపోవడం లేదు:
గతేడాదితో పోలిస్తే దేశంలో ఎగ్స్ సరఫరా స్థిరీకరించబడింది. అయినా కూడా అనేక ప్రాంతాల్లో కొరత నమోదైంది. డిమాండ్కు అనుగుణంగా సరఫరా పెరగలేదు. గత రెండేళ్లలో అనేక చిన్న, మధ్యతరహా యూనిట్లు దీర్ఘకాలిక నష్టాల వల్ల మూతపడ్డాయి. దీనికి తోడు కోళ్ల దాణాలో ముఖ్యమైన మొక్కజొన్న, సోయాబీన్ ధరలు పెరిగాయి. దీనికి వాతావరణ కారణాలు, అధిక ఇన్పుట్ ఖర్చులు పెరగడం వంటివి కారణం అవుతున్నాయి. ఫౌల్ట్రీ రైతు ఖర్చుల్లో కోళ్ల దాణాకే ఎక్కువగా 60 శాతం కన్నా ఎక్కువ వాటా కలిగి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, కోడిగుడ్ల ధరలు రూ. 6.5 నుంచి రూ. 7 కన్నా తక్కువగా ఉంటే రైతులకు ఆర్థికంగా స్థిరంగా ఉండవని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.
రవాణా ఖర్చులు, ఎగ్స్ కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడటం కూడా ధరలు పెరగడానికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తూర్పు భారతదేశంలోని చాలా రాష్ట్రాలు దక్షిణ భారతదేశం నుంచి కోడిగుడ్ల సరఫరాపై ఆధారపడ్డాయి. రవాణా ఖర్చులు, ఇంధన ధరలు, లాజిస్టిక్స్ అడ్డంకులు వల్ల రిటైల్ మార్కెట్లకు సరఫరా చేరే సమయానికి గుడ్డుకు 20 నుండి 40 పైసలు పెరుగుతున్నాయి. ఈ కారణాల వల్ల ఎగ్స్ ధరలు పెరుగుతున్నాయని ఫౌల్ట్రీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..