Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
- ఏకంగా రూ.23 వేల కోట్ల ఏజీఆర్ బకాయిల తగ్గింపు
- గతంలో రూ.87,695 కోట్లుగా ఉన్న ఏజీఆర్ బకాయిలు
- తాజా తగ్గింపుతో రూ.64,046 కోట్లకు చేరిన బకాయిలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vodafone Idea: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi)కు కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘సంజీవని’ని అందించింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR) బకాయిల లెక్కల్లో చోటుచేసుకున్న వ్యత్యాసాలను సవరించిన టెలికాం శాఖ (DoT), కంపెనీకి భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కంపెనీపై ఉన్న దాదాపు రూ.23,649 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గనుంది. ఏజీఆర్ లెక్కింపుపై టెలికాం కంపెనీలు, ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ విచారణ అనంతరం, వీఐ బకాయిలను భారీగా తగ్గించారు. గతంలో రూ.87,695 కోట్లుగా ఉన్న ఏజీఆర్ బకాయిలను ఇప్పుడు రూ.64,046 కోట్లకు సవరించారు. గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
వాయిదాల పద్ధతిలో చెల్లింపులు..
బకాయిలను తగ్గించడమే కాకుండా, వాటిని చెల్లించే గడువును కూడా కేంద్రం వెసులుబాటు కల్పించింది. 2026 మార్చి నాటికి కంపెనీ చెల్లించాల్సిన రూ.16,400 కోట్ల భారం ప్రస్తుతం తప్పుకుంది. 2031-32 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే నాలుగేళ్ల పాటు ఏటా రూ.100 కోట్ల చొప్పున చెల్లించాలి. మిగిలిన భారీ మొత్తాన్ని 2035-36 నుంచి 2040-41 మధ్య ఆరు సమాన వార్షిక వాయిదాలలో చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. టెలికాం రంగంలో ఏకఛత్రాధిపత్యాన్ని నివారించేందుకు కేంద్రం వరుసగా వీఐని ఆదుకుంటూ వస్తోంది. ఇప్పటికే 2021 ప్యాకేజీ కింద బకాయిల వడ్డీని ఈక్విటీగా మార్చడంతో ప్రభుత్వానికి కంపెనీలో 33% వాటా లభించింది. ఇప్పుడు ఏజీఆర్ తగ్గింపుతో కంపెనీ బ్యాలెన్స్ షీట్ మెరుగుపడనుంది.
Also Read
- Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
- EXPLAINER: పెట్రోల్, ఇథనాల్లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
జియో, ఎయిర్టెల్లకు పోటీగా..
ప్రస్తుతం కంపెనీపై రూ.2 లక్షల కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయంతో కంపెనీకి నగదు లభ్యత పెరిగి, కొత్త పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ నిధులతో నెట్వర్క్ విస్తరణను వేగవంతం చేసి, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేందుకు వీఐ సిద్ధమవుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?