India Electronics Exports: టారిఫ్ ఎఫెక్ట్తో ఎలక్ట్రానిక్స్ రంగానికి భారీ ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Electronics Exports: ప్రస్తుతం స్టాక్మార్కెట్లు దూసుకెళ్తున్నాయి.. దానికి కారణం అమెరికా నుంచి వచ్చిన కీలక ప్రకటన. ఈ ప్రకటనతో భారత మార్కెట్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేసే కంపెనీలకు ఇది పెద్ద ఊరటగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం భారత్పై విధించిన టారిఫ్ను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు 50 శాతం పెంచుతామన్న టారిఫ్లను ఏకంగా 18 శాతానికి కుదించారు. ఈ నిర్ణయం భారత్కు మరింత ప్రత్యేకంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కొన్ని ఇతర దేశాలతో పోలిస్తే భారత్పై తక్కువ టారిఫ్ విధించింది. అంటే ఇకపై భారత్ నుంచి అమెరికాకు వెళ్లే సరుకులపై పన్ను భారం తక్కువగా ఉంటుంది. దీని ప్రభావం నేరుగా ఎలక్ట్రానిక్స్ మార్కెట్పై పడనుంది.
READ MORE: CM Chandrababu: కేబినెట్ ప్రారంభానికి ముందే మంత్రులతో విడివిడిగా సీఎం భేటీ..
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
గత కొన్ని ఏళ్లుగా చైనా తర్వాత ప్రపంచంలోనే పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ మారింది. యాపిల్, సామ్సంగ్ వంటి పెద్ద కంపెనీలు తమ స్మార్ట్ఫోన్లను భారత్లో తయారు చేస్తున్నాయి. అయితే గత సంవత్సరం అమెరికా రిసిప్రోకల్ టారిఫ్ ప్రకటించినప్పుడు ఈ రంగానికి పెద్ద షాక్ తగిలింది. అమెరికాలోనే తయారీ చేయాలంటూ ట్రంప్ అప్పట్లో కంపెనీలపై ఒత్తిడి తెచ్చారు. యాపిల్కు కొంత మినహాయింపు ఇచ్చినా, ఆ అనిశ్చితి మార్కెట్లో భయం కలిగించింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. భారత్పై టారిఫ్ను 18 శాతానికి తగ్గించడం వల్ల ఆ అనిశ్చితి చాలావరకు తొలగిపోయింది. ముఖ్యంగా వియత్నాం కంటే భారత్పై తక్కువగా టారిఫ్లు విధించడం గమనించాల్సిన విషయం. వియత్నాం సైతం ఒక పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ దేశం. ఆ దేశంపై యూఎస్ 20 శాతం టారిఫ్ విధించింది. ఇక చైనా నుంచి వచ్చే సరుకులపై అమెరికా 37 శాతం టారిఫ్ విధిస్తోంది. ఈ రెండు దేశాలంకంటే భారత్ పై టారిఫ్లు తక్కువగా ఉన్నాయి. దీంతో భారత్కు అమెరికా మార్కెట్లో స్పష్టమైన లాభం కనిపిస్తోంది.
READ MORE: Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఓటీటీ డీల్ జియో హాట్స్టార్కే.. ఆ మార్పు వెనుక అసలు కథేంటి?
ఇది భారత్లో వస్తువులను తయారీ చేసి అమెరికాకు ఎగుమతి చేసే కంపెనీలకు పెద్ద ఊరట. ఇప్పటికే భారత్ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున స్మార్ట్ఫోన్లు వెళ్తున్నాయి. గత ఏడాది టారిఫ్ విషయంలో అనిశ్చితి ఉన్నప్పటికీ, అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగాయి. అక్టోబర్ 2025లో భారత్ నుంచి అమెరికాకు 1.47 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ఫోన్లు ఎగుమతి అయ్యాయి. 2024లో ఇదే సంఖ్య కేవలం 0.46 బిలియన్ డాలర్లే. గతేడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అమెరికా మార్కెట్కు మొత్తం 10.78 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ఫోన్లు వెళ్లాయి. ఇవన్నీ టారిఫ్పై స్పష్టత లేని సమయంలోనే సాధ్యమయ్యాయి. ఇప్పుడు టారిఫ్ తగ్గడంతో పరిస్థితి మరింత మెరుగవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఈ టారిఫ్ తగ్గింపు భారత్ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ మ్యాప్లో మరింత బలంగా నిలబెడుతోంది. తయారీ కంపెనీలకు ధైర్యం పెరుగుతోంది.
తాజావార్తలు
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
-
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!