India Electronics Exports: టారిఫ్ ఎఫెక్ట్తో ఎలక్ట్రానిక్స్ రంగానికి భారీ ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Electronics Exports: ప్రస్తుతం స్టాక్మార్కెట్లు దూసుకెళ్తున్నాయి.. దానికి కారణం అమెరికా నుంచి వచ్చిన కీలక ప్రకటన. ఈ ప్రకటనతో భారత మార్కెట్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేసే కంపెనీలకు ఇది పెద్ద ఊరటగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం భారత్పై విధించిన టారిఫ్ను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు 50 శాతం పెంచుతామన్న టారిఫ్లను ఏకంగా 18 శాతానికి కుదించారు. ఈ నిర్ణయం భారత్కు మరింత ప్రత్యేకంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కొన్ని ఇతర దేశాలతో పోలిస్తే భారత్పై తక్కువ టారిఫ్ విధించింది. అంటే ఇకపై భారత్ నుంచి అమెరికాకు వెళ్లే సరుకులపై పన్ను భారం తక్కువగా ఉంటుంది. దీని ప్రభావం నేరుగా ఎలక్ట్రానిక్స్ మార్కెట్పై పడనుంది.
READ MORE: CM Chandrababu: కేబినెట్ ప్రారంభానికి ముందే మంత్రులతో విడివిడిగా సీఎం భేటీ..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
గత కొన్ని ఏళ్లుగా చైనా తర్వాత ప్రపంచంలోనే పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ మారింది. యాపిల్, సామ్సంగ్ వంటి పెద్ద కంపెనీలు తమ స్మార్ట్ఫోన్లను భారత్లో తయారు చేస్తున్నాయి. అయితే గత సంవత్సరం అమెరికా రిసిప్రోకల్ టారిఫ్ ప్రకటించినప్పుడు ఈ రంగానికి పెద్ద షాక్ తగిలింది. అమెరికాలోనే తయారీ చేయాలంటూ ట్రంప్ అప్పట్లో కంపెనీలపై ఒత్తిడి తెచ్చారు. యాపిల్కు కొంత మినహాయింపు ఇచ్చినా, ఆ అనిశ్చితి మార్కెట్లో భయం కలిగించింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. భారత్పై టారిఫ్ను 18 శాతానికి తగ్గించడం వల్ల ఆ అనిశ్చితి చాలావరకు తొలగిపోయింది. ముఖ్యంగా వియత్నాం కంటే భారత్పై తక్కువగా టారిఫ్లు విధించడం గమనించాల్సిన విషయం. వియత్నాం సైతం ఒక పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ దేశం. ఆ దేశంపై యూఎస్ 20 శాతం టారిఫ్ విధించింది. ఇక చైనా నుంచి వచ్చే సరుకులపై అమెరికా 37 శాతం టారిఫ్ విధిస్తోంది. ఈ రెండు దేశాలంకంటే భారత్ పై టారిఫ్లు తక్కువగా ఉన్నాయి. దీంతో భారత్కు అమెరికా మార్కెట్లో స్పష్టమైన లాభం కనిపిస్తోంది.
READ MORE: Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఓటీటీ డీల్ జియో హాట్స్టార్కే.. ఆ మార్పు వెనుక అసలు కథేంటి?
ఇది భారత్లో వస్తువులను తయారీ చేసి అమెరికాకు ఎగుమతి చేసే కంపెనీలకు పెద్ద ఊరట. ఇప్పటికే భారత్ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున స్మార్ట్ఫోన్లు వెళ్తున్నాయి. గత ఏడాది టారిఫ్ విషయంలో అనిశ్చితి ఉన్నప్పటికీ, అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగాయి. అక్టోబర్ 2025లో భారత్ నుంచి అమెరికాకు 1.47 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ఫోన్లు ఎగుమతి అయ్యాయి. 2024లో ఇదే సంఖ్య కేవలం 0.46 బిలియన్ డాలర్లే. గతేడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అమెరికా మార్కెట్కు మొత్తం 10.78 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ఫోన్లు వెళ్లాయి. ఇవన్నీ టారిఫ్పై స్పష్టత లేని సమయంలోనే సాధ్యమయ్యాయి. ఇప్పుడు టారిఫ్ తగ్గడంతో పరిస్థితి మరింత మెరుగవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఈ టారిఫ్ తగ్గింపు భారత్ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ మ్యాప్లో మరింత బలంగా నిలబెడుతోంది. తయారీ కంపెనీలకు ధైర్యం పెరుగుతోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!