Site icon NTV Telugu

మహిళలకు షాక్‌.. మరోసారి ఎగిసిపడ్డ పసిడి ధరలు

గ‌త ఐదు రోజులుగా తగ్గుతు వస్తున్న బంగారం ధ‌ర‌లు ఈరోజు తిరిగి భారీగా పెరిగాయి. ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డ‌తాయ‌ని అనుకున్న వినియోగ‌దారుల‌కు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవ‌డంతో ధ‌ర‌లు పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 పెరిగి రూ. 44,100 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 పెరిగి రూ. 48,100 కి చేరింది. ఇక బంగారం ధరలు పెరిగితే… వెండి ధరలు మాత్రం నిలకడగా నమోదయ్యాయి. కిలో వెండి ధ‌ర రూ. 73,400కి చేరింది.

Exit mobile version