TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- వరస లేఆఫ్స్ మధ్య టీసీఎస్ కొత్త సాలరీ పాలసీ..
- ఆఫీస్ హాజరుతో లింక్ చేయడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి..
- జీతాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: వరస లేఆఫ్స్ తో టెక్ రంగంలో అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) నిర్ణయం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. వేరియబెల్ పే విధానాన్ని మార్చి, ఆఫీస్ హాజరుతో లింక్ చేయడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 6 లక్షల మంది ఉద్యోగులపై ఇది ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు వేరియబుల్ పే రూపంలో నెలవారీగా లేదా క్వార్టర్లీ వారీగా అందుతున్న మొత్తాన్ని ఇప్పటి నుంచి ‘‘మంత్లీ పర్ఫామెన్స్ పే’’గా మార్చారు. దీంతో ఉద్యోగులు ఆఫీస్ హాజరు, ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ ఆధారంగా నిర్ణయించనున్నారు. దీని కారణంగా ఆఫీస్ తక్కువగా వచ్చే ఉద్యోగులకు టేక్-హోమ్ సాలరీ తగ్గే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు, ఈ ఏడాది టీసీస్ సాధారణంగా 5 శాతం నుంచి 8 శాతం వరకు జీతాలను పెంచినట్లు సమాచారం. మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులకు A+ కేటగిరీలో చేర్చి, 10 శాతం నుంచి 13 శాతం వరకు పెంచినట్లు తెలుస్తోంది. తక్కువ రేటింగ్ పొందిన వారికి కేవలం 2 శాతం నుంచి 3 శాతం వరకు మాత్రమే పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, దేశంలో కొత్త లేబర్ కోడ్స్కు అనుగుణంగా కంపెనీ వేతన నిర్మాణాన్ని అమలు చేస్తున్నట్లు టీసీఎస్ చెబుతోంది.
Also Read
- Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
- Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
కొంత మంది ఉద్యోగులకు నెలవారీ వేరియబుల్ పే తగ్గినట్లు తెలుస్తోంది. కొందరికి త్రైమాసిక లేదా వార్షిక జీతం మారింది. గ్రుచ్యుటీ కూడా సీటీసీలో కనిపించడం లేదని మరికొందరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, కొత్త విధానంలో వేరియబుల్ పేను రెండు భాగాలుగా విభజించినట్లు సమాచారం. మంత్లీ పర్ఫామెన్స్ పే, పర్ఫామెన్స్ బోనస్ రూపంలో క్వార్టర్లీకి బదులుగా వార్షికంగా చెల్లించే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ రెండు అంశాల్లో కోత పడితే టేక్ హోం సాలరీ తగ్గుతుంది. మరోవైపు, మేనేజర్లు ఎక్కువ మంది ఉద్యోగుల్ని తక్కువ పనితీరు కేటగిరి ‘‘Band D’’లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ కేటగిరీలో ఉన్న ఉద్యోగుల జీతాలు, ఉద్యోగ భద్రతపై ప్రభావం ఉండొచ్చని భయం మొదలైంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!