TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- వరస లేఆఫ్స్ మధ్య టీసీఎస్ కొత్త సాలరీ పాలసీ..
- ఆఫీస్ హాజరుతో లింక్ చేయడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి..
- జీతాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: వరస లేఆఫ్స్ తో టెక్ రంగంలో అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) నిర్ణయం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. వేరియబెల్ పే విధానాన్ని మార్చి, ఆఫీస్ హాజరుతో లింక్ చేయడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 6 లక్షల మంది ఉద్యోగులపై ఇది ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు వేరియబుల్ పే రూపంలో నెలవారీగా లేదా క్వార్టర్లీ వారీగా అందుతున్న మొత్తాన్ని ఇప్పటి నుంచి ‘‘మంత్లీ పర్ఫామెన్స్ పే’’గా మార్చారు. దీంతో ఉద్యోగులు ఆఫీస్ హాజరు, ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ ఆధారంగా నిర్ణయించనున్నారు. దీని కారణంగా ఆఫీస్ తక్కువగా వచ్చే ఉద్యోగులకు టేక్-హోమ్ సాలరీ తగ్గే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు, ఈ ఏడాది టీసీస్ సాధారణంగా 5 శాతం నుంచి 8 శాతం వరకు జీతాలను పెంచినట్లు సమాచారం. మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులకు A+ కేటగిరీలో చేర్చి, 10 శాతం నుంచి 13 శాతం వరకు పెంచినట్లు తెలుస్తోంది. తక్కువ రేటింగ్ పొందిన వారికి కేవలం 2 శాతం నుంచి 3 శాతం వరకు మాత్రమే పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, దేశంలో కొత్త లేబర్ కోడ్స్కు అనుగుణంగా కంపెనీ వేతన నిర్మాణాన్ని అమలు చేస్తున్నట్లు టీసీఎస్ చెబుతోంది.
Also Read
- LIC: ఎల్ఐసీ నుంచి జీవన్ సాథి పేరుతో రెండు కొత్త ప్లాన్లు.. మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ బెనిఫిట్స్
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
కొంత మంది ఉద్యోగులకు నెలవారీ వేరియబుల్ పే తగ్గినట్లు తెలుస్తోంది. కొందరికి త్రైమాసిక లేదా వార్షిక జీతం మారింది. గ్రుచ్యుటీ కూడా సీటీసీలో కనిపించడం లేదని మరికొందరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, కొత్త విధానంలో వేరియబుల్ పేను రెండు భాగాలుగా విభజించినట్లు సమాచారం. మంత్లీ పర్ఫామెన్స్ పే, పర్ఫామెన్స్ బోనస్ రూపంలో క్వార్టర్లీకి బదులుగా వార్షికంగా చెల్లించే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ రెండు అంశాల్లో కోత పడితే టేక్ హోం సాలరీ తగ్గుతుంది. మరోవైపు, మేనేజర్లు ఎక్కువ మంది ఉద్యోగుల్ని తక్కువ పనితీరు కేటగిరి ‘‘Band D’’లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ కేటగిరీలో ఉన్న ఉద్యోగుల జీతాలు, ఉద్యోగ భద్రతపై ప్రభావం ఉండొచ్చని భయం మొదలైంది.
తాజావార్తలు
-
TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
-
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
-
Virat Kohli: స్టాండ్స్లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!