Stock market: స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపు.. నిఫ్టీ ఆల్టైమ్ రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాక్ మార్కెట్లు కొత్త రూపు సంతరించుకున్నాయి. మునుపెన్నడూ లేనంతగా గురువారం సూచీలు లాభాల్లో దూసుకుపోవడం ఆర్థిక నిపుణులకు ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే ఈ స్థాయిలో లాభాల్లో దూసుకుపోవడం సరికొత్త ఒరవడిని సృష్టించింది.
ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభం నుంచి ఊహించని రీతిలో లాభాల్లో దూసుకెళ్లాయి. ఇక నిఫ్టీ అయితే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. 369 పాయింట్లు లాభపడి.. 22, 967 దగ్గర ముగిసింది. ఇక 23 వేల మార్కుకి అతి చేరువలోనే ఉంది. ఈ స్థాయిలో నిఫ్టీ ట్రేడవడం ఇదే తొలిసారి. ఇక సెన్సెక్స్ కూడా భారీ లాభాల్లో దూసుకుపోయింది. 1196 పాయింట్లు లాభపడి 75, 418 దగ్గర సెన్సెక్స్ ముగిసింది.
Also Read
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
- Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
- Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
- Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోవచ్చని నిపుణులు భావించారు. కానీ అంతకంటే ముందుగానే ఈ స్థాయిలో సూచీలు లాభపడడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికి తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలే కారణమని అంతా భావిస్తున్నారు.
నిఫ్టీలో ఆటో, ఐటీ, బ్యాంకులు లాభాల్లో దూసుకుపోయాయి. మెటల్ మరియు ఫార్మా మినహా ఇతర అన్ని రంగాల సూచీలు ఆటో, బ్యాంక్ మరియు క్యాపిటల్ గూడ్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్ప్, హిండాల్కో, కోల్ ఇండియా ఉన్నాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి. నష్టపోయిన వాటిలో సన్ ఫార్మా మరియు పవర్ గ్రిడ్ ఉన్నాయి. ఇతర నష్టాల్లో హిందాల్కో, కోల్ ఇండియా ఎన్టిపీసీ ఉన్నాయి.
స్టాక్ మార్కెట్లు ఈ స్థాయిలో దూసుకెళ్లడానికి ఆర్బీఐ తాజాగా నిర్ణయాలే కారణంగా చెబుతున్నారు. ఇటీవల కేంద్రానికి డివిడెండ్ ప్రకటించడమే సూచీల పరుగుకు ప్రధాన కారణంగా వ్యాఖ్యానిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.2.11 లక్షల కోట్లను ఆర్బీఐ ప్రభుత్వానికి అందించనుంది. ఇది కేంద్రం ద్రవ్యలోటు పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది. అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా ఒక కారణంగా చెప్పొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా తాజాగా హెచ్ఎస్బీసీ వెలువరించిన డేటా కూడా సూచీలు రాణించడానికి మరో కారణంగా చెబుతున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!