Stock Markets: కంపెనీల ఫలితాల నేపథ్యంలో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్..
నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ రికార్డు స్థాయిలో జీఎస్టీ రాబడి, అనేక కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఇండెక్స్ ను లాభాల వైపుకు తీసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర తగ్గడం కూడా ఇందుకు ఒక కారణం. ఆటో స్టాక్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ స్టాక్స్ మంచి పనితీరు కనబరిచాయి. ఇక మరోవైపు బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొవడంతో నష్టాలలో ట్రేడ్ అయ్యాయి. ఇది ఇండెక్స్ ను చిన్న లాభాలకు మాత్రమే పరిమితం చేసాయి.
Also read: WhatsApp Update: జిమెయిల్ తో పనిలేకుండా సరికొత్త కొత్త ఫీచర్ ను అందించనున్న వాట్సాప్..
Also Read
- Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
- Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
- Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..
- Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..
ఉదయం సెన్సెక్స్ 74,391.73 పాయింట్లతో స్వల్ప నష్టలతో ప్రారంభమైంది. ఆ తర్వాత కోలుకున్న.. హెచ్చు తగ్గుల మధ్య, మార్కెట్ సమయం ముగిసే సరికి లాభాల్లో ఉన్నాయి. సూచీ రోజువారీ గరిష్ట స్థాయి 74812.43 పాయింట్లకు చేరుకుంది, అయితే చివరకు 128.33 పాయింట్ల పెరుగుదలతో 74611.11 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 37.80 పాయింట్లు పెరిగి 22,642.65 వద్దకు చేరుకుంది. ఇక డాలర్ తో రూపాయి మారకం విలువ 83.46 వద్ద ఉంది. సెన్సెక్స్ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.91%), ఏసియన్ పెయింట్స్ (3.36%), టాటా మోటార్స్ (1.99%), ఎన్టీపీసీ (1.72%), టాటా స్టీల్ (1.45%).
షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇక నష్టపోయిన వాటిలో కోటక్ బ్యాంక్ (-2.95%), యాక్సిస్ బ్యాంక్ (-1.41%), భారతి ఎయిర్ టెల్ (-1.26%), విప్రో (-1.09%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.05%) లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 84.21 డాలర్స్ వద్ద కొనసాగుతోంది.
Also read: Snake In Car: వామ్మో.. రోడ్డు పై వేగంగా వెళ్తున్న కారు.. కాకపోతే కారు కింద చూస్తే.. షాకింగ్ వీడియో..
ఇక నేడు ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు దారుణంగా పడిపోయాయి. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిఎస్ మన్నియన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేసినట్లు బ్యాంక్ ప్రకటించింది. శ్రీ మణియన్ దాదాపు మూడు దశాబ్దాలుగా కోటక్ మహీంద్రా బ్యాంక్లో పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆన్లైన్ ఛానెల్ల ద్వారా కొత్త కస్టమర్లు, క్రెడిట్ కార్డుల జారీపై ఆర్బీఐ ఇప్పటికే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగా, కోటక్ షేర్లు తాత్కాలికంగా 4% పడిపోయి 52 వారాల కనిష్టానికి చేరాయి. బిఎస్ఈ లో చివరకు 2.78 % పతనమై 1,578.65 వద్ద ముగిసింది.
తాజావార్తలు
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
-
Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
-
Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టు షాక్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!