Stock Markets: కంపెనీల ఫలితాల నేపథ్యంలో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ రికార్డు స్థాయిలో జీఎస్టీ రాబడి, అనేక కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఇండెక్స్ ను లాభాల వైపుకు తీసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర తగ్గడం కూడా ఇందుకు ఒక కారణం. ఆటో స్టాక్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ స్టాక్స్ మంచి పనితీరు కనబరిచాయి. ఇక మరోవైపు బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొవడంతో నష్టాలలో ట్రేడ్ అయ్యాయి. ఇది ఇండెక్స్ ను చిన్న లాభాలకు మాత్రమే పరిమితం చేసాయి.
Also read: WhatsApp Update: జిమెయిల్ తో పనిలేకుండా సరికొత్త కొత్త ఫీచర్ ను అందించనున్న వాట్సాప్..
Also Read
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
ఉదయం సెన్సెక్స్ 74,391.73 పాయింట్లతో స్వల్ప నష్టలతో ప్రారంభమైంది. ఆ తర్వాత కోలుకున్న.. హెచ్చు తగ్గుల మధ్య, మార్కెట్ సమయం ముగిసే సరికి లాభాల్లో ఉన్నాయి. సూచీ రోజువారీ గరిష్ట స్థాయి 74812.43 పాయింట్లకు చేరుకుంది, అయితే చివరకు 128.33 పాయింట్ల పెరుగుదలతో 74611.11 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 37.80 పాయింట్లు పెరిగి 22,642.65 వద్దకు చేరుకుంది. ఇక డాలర్ తో రూపాయి మారకం విలువ 83.46 వద్ద ఉంది. సెన్సెక్స్ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.91%), ఏసియన్ పెయింట్స్ (3.36%), టాటా మోటార్స్ (1.99%), ఎన్టీపీసీ (1.72%), టాటా స్టీల్ (1.45%).
షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇక నష్టపోయిన వాటిలో కోటక్ బ్యాంక్ (-2.95%), యాక్సిస్ బ్యాంక్ (-1.41%), భారతి ఎయిర్ టెల్ (-1.26%), విప్రో (-1.09%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.05%) లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 84.21 డాలర్స్ వద్ద కొనసాగుతోంది.
Also read: Snake In Car: వామ్మో.. రోడ్డు పై వేగంగా వెళ్తున్న కారు.. కాకపోతే కారు కింద చూస్తే.. షాకింగ్ వీడియో..
ఇక నేడు ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు దారుణంగా పడిపోయాయి. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిఎస్ మన్నియన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేసినట్లు బ్యాంక్ ప్రకటించింది. శ్రీ మణియన్ దాదాపు మూడు దశాబ్దాలుగా కోటక్ మహీంద్రా బ్యాంక్లో పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆన్లైన్ ఛానెల్ల ద్వారా కొత్త కస్టమర్లు, క్రెడిట్ కార్డుల జారీపై ఆర్బీఐ ఇప్పటికే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగా, కోటక్ షేర్లు తాత్కాలికంగా 4% పడిపోయి 52 వారాల కనిష్టానికి చేరాయి. బిఎస్ఈ లో చివరకు 2.78 % పతనమై 1,578.65 వద్ద ముగిసింది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!