దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికుల సౌకర్యార్థం, రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. చెన్నైలోని ఎగ్మోర్ (Chennai Egmore) రైల్వే స్టేషన్లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల దృష్ట్యా, చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులలో తాత్కాలిక మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రైలు సర్వీసుల మార్పు వివరాలు ఇలా..
సికింద్రాబాద్ రైల్టే స్టేషన్ నుంచి చెన్నైలోని తాంబరం వరకు వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్ (12760/12759) ఇకపై చెన్నై బీచ్ (Chennai Beach) స్టేషన్ కేంద్రంగా తన సేవలను అందిస్తుంది.
Also Read:Mrunal Thakur: లవ్ లైఫ్పై ఓపెన్ అయిన మృణాల్ ఠాకూర్.. అన్ని హద్దులు దాటే సమయం వచ్చేసింది..!
రైలు నంబర్ 12760 (హైదరాబాద్ – తాంబరం)..
ఈ రైలు సాధారణంగా తాంబరం వరకు వెళ్లాల్సి ఉండగా.. ఏప్రిల్ 5, 2026 నుంచి తన ప్రయాణాన్ని చెన్నై బీచ్ స్టేషన్లోనే ముగిస్తుంది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ మార్పు అమలులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 07:00 గంటలకు చెన్నై బీచ్ స్టేషన్కు చేరుకుంటుంది.
Train No. 12760 / 12759 Hyderabad – Tambaram – Hyderabad Charminar Express will terminate Originate from Chennai Beach instead of Tambaram @drmsecunderabad @drmhyb @drmvijayawada @drmgnt pic.twitter.com/9X2xDUhZ5d
— South Central Railway (@SCRailwayIndia) April 3, 2026
రైలు నంబర్ 12759 (తాంబరం – హైదరాబాద్)..
తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ రైలు ఏప్రిల్ 6, 2026 నుంచి తాంబరంకు బదులుగా చెన్నై బీచ్ స్టేషన్ నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది సాయంత్రం 18:20 గంటలకు (6:20 PM) చెన్నై బీచ్ నుంచి బయలుదేరుతుంది.