Interest Rates: SSY, PPF వడ్డీ రేట్లు ఖరారు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏప్రిల్ 1 నుంచి అమలు..
- కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..
- PPF, SSY వడ్డీ రేట్లు ఖరారు..
- ఎనిమిదవ త్రైమాసికంలో కూడా వడ్డీ రేట్లు యథాతథం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్ – జూన్) సంబంధించి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. అంటే గతంలో ఉన్న వడ్డీ రేట్లే ఈ మూడు నెలలు కూడా కొనసాగుతాయి.
వడ్డీ రేట్లు ఎందుకు మారలేదు..?
Also Read
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- NPPA: సామాన్యుడికి భారీ ఉపశమనం.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం
- RailOne Ticket Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆ టిక్కెట్స్ చెల్లవు.. కొత్త నిబంధనలు వెల్లడించిన భారతీయ రైల్వే
- Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
సాధారణంగా ద్రవ్యోల్బణం, మార్కెట్ పరిస్థితులను బట్టి ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. అయితే.. వరుసగా ఎనిమిదవ త్రైమాసికంలో కూడా వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచారు. చివరిసారిగా 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ రేట్లలో మార్పులు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.
కేంద్రం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం వివిధ పథకాల వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా.. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకానికి అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకంలో భాగంగా.. దీర్ఘకాలిక పొదుపు కోసం ఎంతో మంది ఎంచుకునే ఈ పథకానికి 7.1 శాతం వడ్డీ కొనసాగుతుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పథకంలో.. వృద్ధులకు భరోసా ఇచ్చే ఈ పథకానికి 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకంపై 7.7 శాతం వడ్డీ రానుంది.
కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకంపై 7.5 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఈ పథకంలో మీరు పెట్టిన పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS) పథకం విషయానికి వస్తే.. ప్రతినెలా ఆదాయం కోరుకునే వారికి 7.4 శాతం వడ్డీ అందుతుంది. పోస్టాఫీసు సేవింగ్స్ పథకంలో సాధారణ పొదుపు ఖాతాలపై 4 శాతం వడ్డీ లభిస్తుంది.
పెట్టుబడిదారులకు కలిగే ప్రయోజనం..
మార్కెట్లో బ్యాంక్ వడ్డీ రేట్లు మారుతున్నప్పటికీ.. ప్రభుత్వ పథకాల్లో వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం వల్ల సామాన్యులకు, రిటైర్డ్ ఉద్యోగులకు తమ రాబడిపై ఒక స్పష్టమైన భరోసా ఉంటుంది. సురక్షితమైన పెట్టుబడితో పాటు పన్ను మినహాయింపులు కూడా లభించడం వల్ల చాలా మంది ఇప్పటికీ పోస్టాఫీసు, ప్రభుత్వ పొదుపు పథకాలనే నమ్ముకుంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!