SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS) రంగంలో పెట్టుబడిదారులకు, పరిశ్రమకు పెద్ద ఊరటనిస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక స్పష్టతను ఇచ్చింది. నాన్-డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (ND-PMS) కింద పెట్టుబడి పెట్టే క్లయింట్లు, రుణాలు పొందేందుకు తమ షేర్లను తాకట్టు పెట్టుకోవచ్చని సెబీ స్పష్టం చేసింది. దీనివల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విక్రయించకుండానే అత్యవసర నిధులను సమకూర్చుకునే అవకాశం లభిస్తుంది. రిజిస్టర్డ్ పోర్ట్ఫోలియో మేనేజర్ అయిన ‘జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్’ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సెబీ ఈ వివరణ ఇచ్చింది. PMS ఖాతాల్లోని షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందా లేదా అనే అంశంపై కంపెనీ మార్గదర్శకాలను కోరింది.
పిఎమ్ఎస్ (PMS) అనేది నిపుణులు క్లయింట్ల తరపున స్టాక్ పోర్ట్ఫోలియోను నిర్వహించే పెట్టుబడి సేవ. ఇందులో ‘నాన్-డిస్క్రిషనరీ’ మోడల్ కింద పెట్టుబడి నిర్ణయాలన్నీ క్లయింట్ మాత్రమే తీసుకుంటారు. మేనేజర్ కేవలం ఆ ట్రేడ్లను అమలు చేయడానికి మాత్రమే పరిమితం అవుతారు. సెబీ తన తాజా స్పష్టతలో.. ఆ షేర్లు క్లయింట్ పేరు మీదే ఉంటాయని, యాజమాన్య హక్కులు కూడా వారివే కాబట్టి, రుణాలు పొందేందుకు వాటిని కొలేటరల్గా అంటే హామీగా ఉపయోగించుకునే పూర్తి స్వేచ్ఛ ఇన్వెస్టర్లకు ఉంటుందని తెలిపింది. అయితే.. ఈ తాకట్టు నిర్ణయం పూర్తిగా క్లయింట్ స్వంతం కావాలి. ఈ ప్రక్రియను పోర్ట్ఫోలియో మేనేజర్ చేసిన అప్పుగా పరిగణించబోమని.. ఎందుకంటే నిబంధనల ప్రకారం పోర్ట్ఫోలియో మేనేజర్లు రుణాలు తీసుకోవడం నిషేధమని సెబీ పేర్కొంది.
Also Read
- Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
- Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
- Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
- Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ 'లాక్డౌన్' లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
మరో కీలకమైన అంశంలో.. ఒకవేళ సదరు తాకట్టును లెండర్ అంటే రుణదాత ఇంకా క్లెయిమ్ చేయనంతవరకు, ఆ షేర్లను పోర్ట్ఫోలియో మేనేజర్లు తమ ‘అస్సెట్స్ అండర్ మేనేజ్మెంట్’ పరిధిలోనే లెక్కించవచ్చని సెబీ అనుమతించింది. దీనివల్ల మేనేజర్ల ఏయూఎమ్ గణాంకాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు. అయితే.. పోర్ట్ఫోలియో మేనేజర్లు ఈ రుణ లావాదేవీలలో ఏ విధంగానూ భాగస్వామ్యం కాకూడదని సెబీ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లు లోన్ డిఫాల్ట్ అంటే.. బకాయిలు చెల్లించకపోవడం లాంటివి జరిగినప్పుడు రుణదాతలు ఆ షేర్లను మార్కెట్లో విక్రయించే హక్కు కలిగి ఉంటారు. ఇది మార్కెట్ అస్థిరతకు కారణం కావచ్చు కాబట్టి ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా.. ఈ నిర్ణయం వెల్త్ మేనేజ్మెంట్ రంగానికి కొత్త ఊపును ఇవ్వనుంది.
తాజావార్తలు
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!