NTV Telugu Site icon

Karnataka: బైక్ మెకానిక్‌కి రూ. 25 కోట్ల లాటరీ.. ట్యాక్స్ ఎంతో తెలుసా?

Lottery

Lottery

తిరువోణం బంపర్ లాటరీ 2024లో కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్ రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. కేరళేతర నివాసి ఈ పెద్ద లాటరీని గెలుచుకోవడం ఇది వరుసగా రెండో సంవత్సరం. గత బుధవారం తిరువనంతపురంలో లాటరీ డ్రా జరిగింది. టికెట్ ధర రూ.500 మాత్రమే. అయితే లాటరీ మొత్తం రూ.25 కోట్లలో పెద్ద మొత్తంలో పన్ను మినహాయించబడుతుంది. ఈ లక్కీ టికెట్ (TG 43422) సుల్తాన్ బతేరి, వాయనాడ్‌లో విక్రయించబడింది. విజేత ముహమ్మద్ అల్తాఫ్ కొనుగోలు చేశాడు. అతను కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురం నివాసి. అల్తాఫ్ ద్విచక్ర వాహన మెకానిక్. బాథోరిలో ఎన్‌జిఆర్ లాటరీని నడుపుతున్న నాగరాజ్ విజయం గురించి అల్తాఫ్‌కు తెలియజేశాడు.

READ MORE: Baba Siddique murder: బాబా సిద్ధిక్ హత్య కేసులో ట్విస్ట్.. నిందితుల్లో ఒకరికి ‘‘బోన్ అసిఫికేషన్ టెస్ట్’’

చేతికి ఎంత డబ్బు వస్తుంది?
రూ. 25 కోట్ల భారీ విజయం అనంతరం అల్తాఫ్ పన్ను మినహాయింపు తర్వాత సుమారు రూ. 13 కోట్లను అందుకుంటారు. అల్తాఫ్ మాట్లాడుతూ.. ‘అదంతా దేవుడి దయ. నేను 15 సంవత్సరాలుగా టిక్కెట్లు కొంటున్నాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీనంగడిలో నివసించే నా చిన్ననాటి స్నేహితుల్లో ఒకరిని కలవడానికి నేను తరచుగా వయనాడ్ వెళ్తుంటాను. ఆయన్ను కలవడానికి వెళ్లినప్పుడల్లా టిక్కెట్టు కొనేవాడిని.” అని తెలిపాడు.
అల్తాఫ్ ప్రస్తుతం భార్య, కుమార్తెతో కలిసి పాండవపురంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. లాటరీ డబ్బుతో సొంత ఇల్లు కట్టుకోవాలని అల్తాఫ్ ప్లాన్ చేస్తున్నాడు.

READ MORE: Suicide: మాజీ కానిస్టేబుల్ ఆత్మహత్య.. తనను కేసులో ఇరికించిన వారి పేర్లు వీడియోలో వెల్లడి

పూర్తి లాటరీ మొత్తాన్ని ఎందుకు పొందలేరు?
భారతదేశంలో, లాటరీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదాయపు పన్ను చట్టం కింద పరిగణిస్తారు. దీనిపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లాటరీ విజయాలపై చెల్లించాల్సిన ఆదాయపు పన్ను రేటు మీ మొత్తం ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. అత్యధిక స్లాబ్ రేటు సాధారణంగా లాటరీ ఆదాయానికి వర్తిస్తుంది.