Site icon NTV Telugu

SBI: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్బీఐ.. నేటి నుంచే అమల్లోకి..

Sbi

Sbi

SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ).. తన కస్టమర్లకు షాకిచ్చింది.. వడ్డీ రేట్లను మరోసారి వడ్డిస్తూ నిర్ణయం తీసుకుంది.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (BPLR)ని 70 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) లేదా 0.7 శాతం నుండి 14.85 శాతానికి పెంచేసింది.. ప్రస్తుత బీపీఎల్‌ఆర్‌ 14.15 శాతంగా ఉండగా.. అది 14.85 శాతానికి పెరగనుంది.. దేశంలోని అతిపెద్ద పబ్లిక్ లెండర్ కూడా బేస్ రేటును 9.40 శాతం నుండి 10.10 శాతానికి 70 బీపీఎస్‌లు పెంచనుంది. దీంతో వీటి ఆధారంగా బ్యాంక్‌ ఇచ్చే గృహ, వాహన, విద్య, వ్యక్తిగత తదితర రుణాలపై వడ్డీరేట్లు మరింత పెరగనున్నాయి. ఎస్బీఐ తన బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటుతో పాటు బేస్ రేటును గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ సవరించిన విషయం విదితమే.. తాజాగా పెరిగిన వడ్డీ రేట్లను ఇవాళ్టి నుంచి అమలు చేయనున్నట్టు పేర్కొంది ఎస్బీఐ.

Read Also: NTR: రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు.. తారక్ కళ్ళల్లో నీళ్లు

అయితే పబ్లిక్ లెండర్, ఫండ్స్ ఆధారిత రుణ రేట్ల మార్జినల్ కాస్ట్‌ను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. ఎంసీఎల్‌ఆర్‌ అంటే బ్యాంకు ఖాతాదారులకు రుణాలు ఇచ్చే రేటు. ఎస్బీఐ చివరిసారిగా ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను ఈ ఏడాది ఫిబ్రవరి 15న 10 బేసిస్ పాయింట్లు లేదా 0.1 శాతం పెంచింది. ప్రస్తుతం, ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ 7.95 శాతంగా ఉండగా, నెలవారీ ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.10 శాతంగా ఉంది. మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు మరియు ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు వరుసగా 8.10 శాతం మరియు 8.40 శాతంగా ఉన్నాయి. ఒక సంవత్సరం రుణాలు, రెండేళ్ల రుణాలు మరియు మూడేళ్ల రుణాలకు ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు వరుసగా 8.50 శాతం, 8.60 శాతం మరియు 8.70 శాతంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫిబ్రవరి 8న ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చిన తర్వాత ఎస్బీఐ తన కస్టమర్లకు రుణాలు ఇచ్చే రేటును పెంచింది.

Exit mobile version