Reliance: వచ్చే ఏడాది 52000 కోట్ల IPO రావచ్చు
- 5% వాటాను విక్రయించేందుకు సన్నాహాలు
- కంపెనీ విలువ $136-154 బిలియన్లుగా అంచనా
- రూ.10.71 లక్షల కోట్లకు చేరుకున్న రిలయన్స్ ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ యూనిట్ జియో వచ్చే ఏడాది 5% వాటాను విక్రయించడం ద్వారా రూ.52,000 కోట్లు చేరుకుంటుందని కంపెనీ అధికారులు తెలిపారు. కంపెనీ విలువ $136-154 బిలియన్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం రిలయన్స్ వార్షిక ఆదాయం రూ.10.71 లక్షల కోట్లకు చేరుకుంది. 50 కోట్ల జియో వినియోగదారులు మరియు 22 కోట్ల 5G కస్టమర్లు కూడా చేరారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ యూనిట్ జియో దేశంలోనే అతిపెద్ద IPOను తీసుకురాగలదు. ఆ కంపెనీని వచ్చే ఏడాది (ఏప్రిల్-సెప్టెంబర్) స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయవచ్చు. అన్ని అనుమతులు లభిస్తే. ఈ సమయంలో జియో 5% వాటాను విక్రయిస్తుందని కంపెనీ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.. దీని నుండి 6 బిలియన్ డాలర్లు అంటే రూ. 52,000 కోట్లు రాబడి రావచ్చుని అంచనా వేస్తున్నారు.
Also Read
- Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
- Gold Price Today: ఒక్కరోజే రూ.4,300 పెరిగిన బంగారం ధర.. వెండి కూడా భగ్గుమంటోంది!
రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. జియో ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ అంటే IPO తీసుకురావడానికి అవసరమైన సన్నాహాలు చేస్తోందని అన్నారు. విశ్లేషకులు జియో ఎంటర్ప్రైజ్ విలువ $136-154 బిలియన్లుగా అంచనా వేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఏప్రిల్లో, జెఫరీస్ జియో ఎంటర్ప్రైజ్ విలువను $136 బిలియన్లకు పెంచిందన్నారు. 2024-25లో రిలయన్స్ రికార్డు స్థాయిలో రూ.10,71,174 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని నివేదించిందన్నారు. దేశంలో వార్షిక ఆదాయంలో $125 బిలియన్లను దాటిన మొదటి కంపెనీగా అవతరించిందని చెప్పుకొచ్చారు. నికర లాభం రూ.81,309 కోట్లకు పెరిగిందని..2024-25లో ఎగుమతులు రూ.2,83,719 కోట్లుగా ఉన్నాయన్నారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!