జియో వచ్చిన రోజునుండి టెలికాం రంగంలో దూసుకపోతునే ఉంది. అయితే తాజాగా 5జీ స్మార్ట్ఫోన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ స్మార్ట్ఫోన్ కోసం గూగుల్ తో తాజాగా రిలయన్స్ జతకట్టింది. ఈ విషయాన్ని తాజాగా ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇరు కంపెనీలు కొత్త 5జీ స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించడం కోసం కలిసి పనిచేయనున్నాయి. రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. గూగుల్తో వ్యహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు. గూగుల్తో కలిసి ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తయారీ కోసం పని చేస్తామని పేర్కొన్నారు. అయితే అయితే ఈ 5జీ స్మార్ట్ఫోన్ తయారీకి తక్కువ ఖర్చే ఉన్నటుంది అని వార్తలు వస్తున్నాయి.
గూగుల్ తో కలిసి పనిచేయనున్న జియో…
