RBI: క్రిఫ్టోకరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు… తులిప్ పువ్వుతో పోలుస్తూ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రిఫ్టోకరెన్సీ విషయంలో ఆర్బీఐ నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు క్రిఫ్టో కరెన్సీలు ఆర్థిక స్థిరత్వానికి పెనుముప్పు అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. క్రిఫ్టోకరెన్సీల వంటి ప్రైవేటు కరెన్సీలకు ఎలాంటి విలువ ఉండదని, కనీసం తులిప్ పువ్వు విలువ కూడా చేయవని అన్నారు. మదుపర్లు వారి సొంత పూచీకత్తుపైనే పెట్టుబడులు పెడుతుంటారని, క్రిఫ్టోకరెన్సీల గురించి హెచ్చరించాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. స్థూల ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వానికి క్రిఫ్టోకరెన్సీలు పెనుముప్పుగా మారతాయని శక్తికాంత్ దాస్ హెచ్చిరించారు. క్రిఫ్టోకరెన్సీ 17వ శతాబ్ధంలో తులిప్ మానియా వంటిదేనని, అన్నారు.
Read: Starlinks: భూమిపై కూలిపోయిన స్పేస్ ఎక్స్ ఉపగ్రహాలు…
Also Read
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
- Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
- Mahindra Thar 2026: ఆఫ్రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
17 వ శతాబ్ధంలో డచ్ దేశానికి చెందిన ఇన్వెస్టర్లు తులిప్ పువ్వులపై పెట్టుబడులు పెట్టారు. ఈ పువ్వులపై విపరీతంగా పెట్టుబడులు పెట్టడంతో ఆ పువ్వుల ధరలు భారీగా పెరిగాయి. డచ్ ఇన్వెస్టర్ల పెట్టుబడులతో తులిప్ పువ్వు ధర నైపుణ్యం కలిగిన ఒక కార్మికుని వార్షిక ఆదాయం కంటే అధికంగా ఉంది. దాదాపు మూడేళ్లపాటు ఈ తులిప్ మానియా కొనసాగింది. డచ్ ఇన్వెస్టర్లను చూసి ఇతర దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీంతో తులిప్ పువ్వుల ధరలు క్రమంగా దిగివచ్చాయి. ఆ తరువాత ఒక్కసారిగా పడిపోయాయి. తులిప్ పువ్వులపై పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. క్రిఫ్టోకరెన్సీ విషయంలోనూ ఇదే జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Tags
- Cryptocurrency
- Duch
- india
- Investors
- RBI
తాజావార్తలు
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!