Petrol- Diesel Rates Drop: భారీగా తగ్గనున్న చమురు ధరలు.. లీటర్ పెట్రోల్ ఎంతో తెలుసా..?
- ఈ ఏడాదిలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గే ఛాన్స్..
- ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు పెరగడం, డిమాండ్ తగ్గడంతో బ్యారెల్కు 50 డాలర్లు..
- అంతర్జాతీయ ధరలతో భారత్ లో లీటర్ పెట్రోల్ భారీగా తగ్గే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol- Diesel Rates Drop: 2026వ సంవత్సరంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిపోర్టులో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు పెరగడం, డిమాండ్ తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధర జూన్ 2026 నాటికి బ్యారెల్కు 50 డాలర్లకి పడిపోవచ్చని అంచనా. యూఎస్ ఇంధన సమాచార సంస్థ (US EIA) కూడా 2026 మొదటి త్రైమాసికంలో ధరలు సగటున 55 డాలర్లకు తగ్గుతాయని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ ధరలతో భారతీయ క్రూడ్ బాస్కెట్కు దగ్గరి రిలేషన్ ఉండటం, దేశీయంగా కూడా ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గిపోనున్నాయి.
Read Also: Indrakeeladri Dispute: ఇంద్రకీలాద్రిపై పవర్ పంచాయతీ.. సీఎంఓకు చేరిన వివాదం
Also Read
- ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
- SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
- Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
- Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
అయితే, ప్రస్తుతం బ్యారెల్కు 62.20 డాలర్లుగా ఉన్న భారతీయ క్రూడ్ ఆయిల్ ధరలు, రాబోయే రోజుల్లో 53.31 డాలర్లకు తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. దీంతో మన దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంతో పాటు పెట్రోల్ బంకుల్లో సామాన్యులకు ఇంధన ధరల భారం తగ్గిపోనుంది. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి క్రూడ్ ఆయిల్ ధరల్లో 14 శాతం తగ్గుదల కనిపిస్తే, రిటైల్ ద్రవ్యోల్బణం (CPI) సుమారు 22 బేసిస్ పాయింట్ల మేర తగ్గిపోతుందని, ఫలితంగా 2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 3.4 శాతం దిగువకు చేరే ఛాన్స్ ఉందని ఎస్బీఐ రిపోర్టులో విశ్లేషించింది.
Read Also: Vaibhav Suryavanshi History: వైభవ్ సూర్యవంశీ నయా చరిత్ర.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!
మరోవైపు, వెనిజులా అధ్యక్షుడిని అమెరికా సైన్యం బంధించడాన్ని, చైనా సహా పలు దేశాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫలితంగా సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా భావించే బంగారం, వెండి ధరలపైకి నిధులు తరలి వెళ్తు్న్నాయి. అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర 115 డాలర్లు, వెండి ధర 4 డాలర్లు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,40,800కు, కిలో వెండి ధర రూ.2,71,000కు చేరుకుంది.
తాజావార్తలు
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
-
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!