Petrol- Diesel Rates Drop: భారీగా తగ్గనున్న చమురు ధరలు.. లీటర్ పెట్రోల్ ఎంతో తెలుసా..?
- ఈ ఏడాదిలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గే ఛాన్స్..
- ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు పెరగడం, డిమాండ్ తగ్గడంతో బ్యారెల్కు 50 డాలర్లు..
- అంతర్జాతీయ ధరలతో భారత్ లో లీటర్ పెట్రోల్ భారీగా తగ్గే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol- Diesel Rates Drop: 2026వ సంవత్సరంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిపోర్టులో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు పెరగడం, డిమాండ్ తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధర జూన్ 2026 నాటికి బ్యారెల్కు 50 డాలర్లకి పడిపోవచ్చని అంచనా. యూఎస్ ఇంధన సమాచార సంస్థ (US EIA) కూడా 2026 మొదటి త్రైమాసికంలో ధరలు సగటున 55 డాలర్లకు తగ్గుతాయని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ ధరలతో భారతీయ క్రూడ్ బాస్కెట్కు దగ్గరి రిలేషన్ ఉండటం, దేశీయంగా కూడా ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గిపోనున్నాయి.
Read Also: Indrakeeladri Dispute: ఇంద్రకీలాద్రిపై పవర్ పంచాయతీ.. సీఎంఓకు చేరిన వివాదం
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
అయితే, ప్రస్తుతం బ్యారెల్కు 62.20 డాలర్లుగా ఉన్న భారతీయ క్రూడ్ ఆయిల్ ధరలు, రాబోయే రోజుల్లో 53.31 డాలర్లకు తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. దీంతో మన దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంతో పాటు పెట్రోల్ బంకుల్లో సామాన్యులకు ఇంధన ధరల భారం తగ్గిపోనుంది. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి క్రూడ్ ఆయిల్ ధరల్లో 14 శాతం తగ్గుదల కనిపిస్తే, రిటైల్ ద్రవ్యోల్బణం (CPI) సుమారు 22 బేసిస్ పాయింట్ల మేర తగ్గిపోతుందని, ఫలితంగా 2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 3.4 శాతం దిగువకు చేరే ఛాన్స్ ఉందని ఎస్బీఐ రిపోర్టులో విశ్లేషించింది.
Read Also: Vaibhav Suryavanshi History: వైభవ్ సూర్యవంశీ నయా చరిత్ర.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!
మరోవైపు, వెనిజులా అధ్యక్షుడిని అమెరికా సైన్యం బంధించడాన్ని, చైనా సహా పలు దేశాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫలితంగా సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా భావించే బంగారం, వెండి ధరలపైకి నిధులు తరలి వెళ్తు్న్నాయి. అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర 115 డాలర్లు, వెండి ధర 4 డాలర్లు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,40,800కు, కిలో వెండి ధర రూ.2,71,000కు చేరుకుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!