Nirmala Sitharaman: దేశానికి కీలకమైన 3Fలపై.. భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు
- దేశానికి కీలకమైన 3Fలపై నిర్మలా వ్యాఖ్యలు
- భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ, భారత దేశీయ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ సానుకూలంగా, బలంగా ఉందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కొందరు కావాలనే నిరాశావాద కథనాలను ప్రచారం చేస్తున్నారని సీతారామన్ విమర్శించారు. భారత ప్రజలు సాధించిన విజయాలను తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు.
“భారతదేశం ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ప్రజల్లో భయం, అనిశ్చితి కలిగించే చర్యలకు తావులేదు. మన మాటలు, చేతల ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉంది” అని నిర్మళా సీతారామన్ పేర్కొన్నారు.
Also Read
- BSNL దూకుడు.. జియో, ఎయిర్టెల్కు షాక్..
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్లు.. పూర్తి వివరాలు
- Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో భారీ ఆదాయ నష్టం
పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 తగ్గించిన నేపథ్యంలో, ప్రభుత్వానికి 2026లో రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితిలో మూడు ముఖ్య అంశాలు ప్రభావం చూపుతున్నాయని సీతారామన్ పేర్కొన్నారు. అవి:
ఇంధనం (Fuel)
ఎరువులు (Fertilizers)
విదేశీ మారకద్రవ్యం (Forex)
ఈ మూడు “F”లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ సూచనలు కూడా ఈ నేపథ్యంలోనే ఉన్నాయని ఆమె చెప్పారు.
ఎంఎస్ఎంఈల బకాయిలపై ఆందోళన
దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) చెల్లించాల్సిన బకాయిలు రూ.8.1 లక్షల కోట్ల వరకు పెరిగిపోయాయని సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి వాటి నిర్వహణ మూలధనం, వ్యాపార వృద్ధిపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు చేయడంలో 45 రోజుల గడువును మించకూడదని ఆమె సూచించారు.
తాజావార్తలు
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
The Paradise : ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్కు కేవలం 14 రోజులు మాత్రమే
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎలా ఆడాలో ఇషాన్ కిషన్ను చూసి నేర్చుకో!
ట్రెండింగ్
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!