Nirmala Sitharaman: దేశానికి కీలకమైన 3Fలపై.. భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు
- దేశానికి కీలకమైన 3Fలపై నిర్మలా వ్యాఖ్యలు
- భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ, భారత దేశీయ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ సానుకూలంగా, బలంగా ఉందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కొందరు కావాలనే నిరాశావాద కథనాలను ప్రచారం చేస్తున్నారని సీతారామన్ విమర్శించారు. భారత ప్రజలు సాధించిన విజయాలను తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు.
“భారతదేశం ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ప్రజల్లో భయం, అనిశ్చితి కలిగించే చర్యలకు తావులేదు. మన మాటలు, చేతల ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉంది” అని నిర్మళా సీతారామన్ పేర్కొన్నారు.
Also Read
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
- Vande Bharat Freight Train: భారతీయ రైల్వేలో కొత్త అధ్యాయం.. వందే భారత్ తొలి గూడ్స్ రైలు ట్రయల్స్ ప్రారంభం
- Bank Holidays August 2026: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఆగస్టులో సగం రోజులు సెలవులే..!
ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో భారీ ఆదాయ నష్టం
పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 తగ్గించిన నేపథ్యంలో, ప్రభుత్వానికి 2026లో రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితిలో మూడు ముఖ్య అంశాలు ప్రభావం చూపుతున్నాయని సీతారామన్ పేర్కొన్నారు. అవి:
ఇంధనం (Fuel)
ఎరువులు (Fertilizers)
విదేశీ మారకద్రవ్యం (Forex)
ఈ మూడు “F”లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ సూచనలు కూడా ఈ నేపథ్యంలోనే ఉన్నాయని ఆమె చెప్పారు.
ఎంఎస్ఎంఈల బకాయిలపై ఆందోళన
దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) చెల్లించాల్సిన బకాయిలు రూ.8.1 లక్షల కోట్ల వరకు పెరిగిపోయాయని సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి వాటి నిర్వహణ మూలధనం, వ్యాపార వృద్ధిపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు చేయడంలో 45 రోజుల గడువును మించకూడదని ఆమె సూచించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!