Nirmala Sitharaman: దేశానికి కీలకమైన 3Fలపై.. భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు
- దేశానికి కీలకమైన 3Fలపై నిర్మలా వ్యాఖ్యలు
- భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ, భారత దేశీయ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ సానుకూలంగా, బలంగా ఉందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కొందరు కావాలనే నిరాశావాద కథనాలను ప్రచారం చేస్తున్నారని సీతారామన్ విమర్శించారు. భారత ప్రజలు సాధించిన విజయాలను తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు.
“భారతదేశం ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ప్రజల్లో భయం, అనిశ్చితి కలిగించే చర్యలకు తావులేదు. మన మాటలు, చేతల ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉంది” అని నిర్మళా సీతారామన్ పేర్కొన్నారు.
Also Read
- Credit Card Tips: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 ఛార్జీలపై ఒక లుక్కేయండి.. లేదంటే అప్పుల పాలవుతారు!
- Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- LIC: ఎల్ఐసీ నుంచి జీవన్ సాథి పేరుతో రెండు కొత్త ప్లాన్లు.. మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ బెనిఫిట్స్
ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో భారీ ఆదాయ నష్టం
పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 తగ్గించిన నేపథ్యంలో, ప్రభుత్వానికి 2026లో రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితిలో మూడు ముఖ్య అంశాలు ప్రభావం చూపుతున్నాయని సీతారామన్ పేర్కొన్నారు. అవి:
ఇంధనం (Fuel)
ఎరువులు (Fertilizers)
విదేశీ మారకద్రవ్యం (Forex)
ఈ మూడు “F”లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ సూచనలు కూడా ఈ నేపథ్యంలోనే ఉన్నాయని ఆమె చెప్పారు.
ఎంఎస్ఎంఈల బకాయిలపై ఆందోళన
దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) చెల్లించాల్సిన బకాయిలు రూ.8.1 లక్షల కోట్ల వరకు పెరిగిపోయాయని సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి వాటి నిర్వహణ మూలధనం, వ్యాపార వృద్ధిపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు చేయడంలో 45 రోజుల గడువును మించకూడదని ఆమె సూచించారు.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: దేశానికి కీలకమైన 3Fలపై.. భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
-
Bhagyashree: “వయసు కాదు.. పాత్ర గొప్పది”.. రితేష్కు తల్లిగా నటించడంపై భాగ్యశ్రీ క్లారిటీ
-
Keerthy Suresh: దసరా బరిలోకి కీర్తి సురేశ్.. ‘రఫ్తార్’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Delhi Capitals: భారీ మూల్యం చెల్లించుకున్నాం.. గుజరాత్, పంజాబ్ మ్యాచ్లను మర్చిపోలేము: డీసీ హెడ్ కోచ్
-
Nara Lokesh: మహానాడుపై క్లస్టర్ ఇంఛార్జ్లకు నారా లోకేష్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!