Nirmala Sitharaman: దేశానికి కీలకమైన 3Fలపై.. భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు
- దేశానికి కీలకమైన 3Fలపై నిర్మలా వ్యాఖ్యలు
- భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ, భారత దేశీయ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ సానుకూలంగా, బలంగా ఉందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కొందరు కావాలనే నిరాశావాద కథనాలను ప్రచారం చేస్తున్నారని సీతారామన్ విమర్శించారు. భారత ప్రజలు సాధించిన విజయాలను తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు.
“భారతదేశం ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ప్రజల్లో భయం, అనిశ్చితి కలిగించే చర్యలకు తావులేదు. మన మాటలు, చేతల ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉంది” అని నిర్మళా సీతారామన్ పేర్కొన్నారు.
Also Read
- Meta: సోషల్ మీడియా చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! మెటాకు ఏకంగా రూ.120 లక్షల కోట్ల జరిమానా?
- E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
- Adani Aluminium: అదానీ నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు పెద్ద కంపెనీలేనా? ఏకంగా రూ. 1.1 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ సరికొత్త ప్లాన్!
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో భారీ ఆదాయ నష్టం
పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 తగ్గించిన నేపథ్యంలో, ప్రభుత్వానికి 2026లో రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితిలో మూడు ముఖ్య అంశాలు ప్రభావం చూపుతున్నాయని సీతారామన్ పేర్కొన్నారు. అవి:
ఇంధనం (Fuel)
ఎరువులు (Fertilizers)
విదేశీ మారకద్రవ్యం (Forex)
ఈ మూడు “F”లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ సూచనలు కూడా ఈ నేపథ్యంలోనే ఉన్నాయని ఆమె చెప్పారు.
ఎంఎస్ఎంఈల బకాయిలపై ఆందోళన
దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) చెల్లించాల్సిన బకాయిలు రూ.8.1 లక్షల కోట్ల వరకు పెరిగిపోయాయని సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి వాటి నిర్వహణ మూలధనం, వ్యాపార వృద్ధిపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు చేయడంలో 45 రోజుల గడువును మించకూడదని ఆమె సూచించారు.
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!