New Basic Pay Rule: ఉద్యోగులకు అలర్ట్.. పెరగనున్న బేసిక్ పే, గ్రాట్యుటీ…
- ఉద్యోగులకు శుభవార్త..
- త్వరలోనే పెరగనున్న బేసిక్ పే, గ్రాట్యుటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ జీతంలో జరిగే చిన్న మార్పు మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం రాబోతున్న కొత్త వేతన నిబంధనల వల్ల మీ చేతికి వచ్చే జీతం కొంచెం తగ్గినా, గ్రాట్యుటీ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు మాత్రం పెరుగుతాయి. దీనికి ప్రధాన కారణం ’50 శాతం బేసిక్ పే’ నిబంధన. సాధారణంగా కంపెనీలు తమ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి బేసిక్ జీతాన్ని తక్కువగా ఉంచి.. అలవెన్సులను ఎక్కువగా ఇస్తుంటాయి. కానీ కొత్త నిబంధన ప్రకారం.. మీ మొత్తం జీతంలో ‘బేసిక్ పే’ కనీసం 50 శాతం ఉండాలి. గ్రాట్యుటీ అనేది బేసిక్ జీతంపై ఆధారపడి లెక్కించబడుతుంది కాబట్టి, బేసిక్ పెరిగితే మీ గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది.
ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఏడాదికి 12 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడనుకుందాం. పాత పద్ధతిలో బేసిక్ 40 శాతంగా ఉంటే, నెలకు 40 వేల రూపాయలు బేసిక్ అవుతుంది. దీనివల్ల ఏడాదికి సుమారు 23 వేల రూపాయల గ్రాట్యుటీ వస్తుంది. అదే కొత్త నిబంధనతో బేసిక్ 50 శాతానికి పెరిగితే.. అది 50 వేల రూపాయలు అవుతుంది. అప్పుడు గ్రాట్యుటీ ఏడాదికి సుమారు 28 వేల రూపాయలకు పెరుగుతుంది. అంటే ఇక్కడ తేడా తక్కువగానే ఉంటుంది.
Also Read
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
- UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
కానీ ఎక్కువ జీతం తీసుకునే వారిపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఏడాదికి 30 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తికి బేసిక్ జీతం ప్రస్తుతం 30 శాతంగా ఉంటే, అది నెలకు 75 వేల రూపాయలు ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం అది 1.25 లక్షలకు పెరుగుతుంది. దీనివల్ల ఏడాదికి వచ్చే గ్రాట్యుటీ 43 వేల నుంచి ఏకంగా 72 వేల రూపాయలకు పెరుగుతుంది. అంటే దాదాపు 28 వేల రూపాయల లాభం చేకూరుతుంది. ఎవరికైతే బేసిక్ జీతం చాలా తక్కువగా ఉందో.. వారికి ఈ కొత్త నిబంధన వల్ల భవిష్యత్తులో వచ్చే డబ్బు ఎక్కువగా పెరుగుతుంది. మీరు ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేస్తే, ఈ మార్పు వల్ల రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. ప్రస్తుతం మీ చేతికి వచ్చే జీతం కొంచెం తగ్గినా, అది పొదుపు రూపంలో మీ భవిష్యత్తుకు భద్రతను ఇస్తుంది. ఇది ఉద్యోగులకు దీర్ఘకాలంలో మంచి మేలు చేసే మార్పు.
తాజావార్తలు
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!