New Basic Pay Rule: ఉద్యోగులకు అలర్ట్.. పెరగనున్న బేసిక్ పే, గ్రాట్యుటీ…
- ఉద్యోగులకు శుభవార్త..
- త్వరలోనే పెరగనున్న బేసిక్ పే, గ్రాట్యుటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ జీతంలో జరిగే చిన్న మార్పు మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం రాబోతున్న కొత్త వేతన నిబంధనల వల్ల మీ చేతికి వచ్చే జీతం కొంచెం తగ్గినా, గ్రాట్యుటీ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు మాత్రం పెరుగుతాయి. దీనికి ప్రధాన కారణం ’50 శాతం బేసిక్ పే’ నిబంధన. సాధారణంగా కంపెనీలు తమ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి బేసిక్ జీతాన్ని తక్కువగా ఉంచి.. అలవెన్సులను ఎక్కువగా ఇస్తుంటాయి. కానీ కొత్త నిబంధన ప్రకారం.. మీ మొత్తం జీతంలో ‘బేసిక్ పే’ కనీసం 50 శాతం ఉండాలి. గ్రాట్యుటీ అనేది బేసిక్ జీతంపై ఆధారపడి లెక్కించబడుతుంది కాబట్టి, బేసిక్ పెరిగితే మీ గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది.
ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఏడాదికి 12 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడనుకుందాం. పాత పద్ధతిలో బేసిక్ 40 శాతంగా ఉంటే, నెలకు 40 వేల రూపాయలు బేసిక్ అవుతుంది. దీనివల్ల ఏడాదికి సుమారు 23 వేల రూపాయల గ్రాట్యుటీ వస్తుంది. అదే కొత్త నిబంధనతో బేసిక్ 50 శాతానికి పెరిగితే.. అది 50 వేల రూపాయలు అవుతుంది. అప్పుడు గ్రాట్యుటీ ఏడాదికి సుమారు 28 వేల రూపాయలకు పెరుగుతుంది. అంటే ఇక్కడ తేడా తక్కువగానే ఉంటుంది.
Also Read
- TATA Group: టాటా సన్స్కు ఆర్బీఐ ఊహించని షాక్..
- Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
- Zomato: ఫుడ్ లవర్స్కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
- UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
కానీ ఎక్కువ జీతం తీసుకునే వారిపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఏడాదికి 30 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తికి బేసిక్ జీతం ప్రస్తుతం 30 శాతంగా ఉంటే, అది నెలకు 75 వేల రూపాయలు ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం అది 1.25 లక్షలకు పెరుగుతుంది. దీనివల్ల ఏడాదికి వచ్చే గ్రాట్యుటీ 43 వేల నుంచి ఏకంగా 72 వేల రూపాయలకు పెరుగుతుంది. అంటే దాదాపు 28 వేల రూపాయల లాభం చేకూరుతుంది. ఎవరికైతే బేసిక్ జీతం చాలా తక్కువగా ఉందో.. వారికి ఈ కొత్త నిబంధన వల్ల భవిష్యత్తులో వచ్చే డబ్బు ఎక్కువగా పెరుగుతుంది. మీరు ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేస్తే, ఈ మార్పు వల్ల రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. ప్రస్తుతం మీ చేతికి వచ్చే జీతం కొంచెం తగ్గినా, అది పొదుపు రూపంలో మీ భవిష్యత్తుకు భద్రతను ఇస్తుంది. ఇది ఉద్యోగులకు దీర్ఘకాలంలో మంచి మేలు చేసే మార్పు.
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!