LPG Cylinder: వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్రం శుభవార్త.. ఇక కష్టాలు తప్పినట్లే…
- వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..
- బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ..
- గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవన్న కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడటమే కాకుండా.. పంపిణీ ఆలస్యమవుతుండటంతో జనాల్లో ఆందోళన మొదలైంది. అంతర్జాతీయంగా చమురు సరఫరా మార్గాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయన్న వార్తలతో.. అసలు గ్యాస్ దొరుకుతుందా లేదా అన్న భయం జనాలకు గురిచేసింది. చాలా మంది ముందు జాగ్రత్తగా బుకింగ్లు చేసుకుంటూ గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యుల భయాందోళనలను పటాపంచలు చేస్తూ ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది.
Also Read
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
- Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
- Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్గా థాయ్లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
- Govt Hikes Price: ఉల్లి రైతులకు భారీ శుభవార్త.. రైతుల పంట పండినట్లే..
ప్రస్తుతం నెలకొన్న కొరత తాత్కాలికమేనని, గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు కేంద్రం పేర్కొంది. కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే సిలిండర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల ప్రజలు గంటల తరబడి ఏజెన్సీల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. డిమాండ్కు తగ్గట్టుగా ఎల్పీజీ (LPG) ఉత్పత్తిని ఏకంగా 25 శాతం పెంచినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. అంటే గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.
Also Read:Bank Minimum Balance: మినిమం బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు.. లబోదిబోమంటున్న ఖాతాదారులు..
దీనికి తోడు.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు దిగుమతులను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. హార్మూజ్ జలసంధి గుండా సరఫరా నిలిచిపోయినా.. ఆ రూట్తో సంబంధం లేని ఇతర మార్గాల ద్వారా అంతకుమించి చమురును సేకరిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. భారత్కు అవసరమైన గ్యాస్ నిల్వలను సమకూర్చడానికి త్వరలోనే రెండు భారీ ఎల్ఎన్జీ కార్గోలు దేశానికి చేరనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో పరిశ్రమలకు, గృహ అవసరాలకు సరిపడా గ్యాస్ అందుబాటులోకి రానుంది. అంతే కాకుండా.. కృత్రిమ కొరత సృష్టించే వారిపై నిఘా ఉంచామని అధికారులు తెలిపారు. సామాన్యుల ఆవేదనను గుర్తించిన కేంద్రం, యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టడం నిజంగా గ్రేట్ రిలీఫ్ అనే చెప్పాలి.
తాజావార్తలు
-
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
-
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
-
Bhadra Rajyoga 2026: జూలై 7 నుంచి ఈ మూడు రాశుల అదృష్టం మారనుందా? బుధుడి సంచారం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!