Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ త్వరలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ను ఒక్కో షేరుకు రూ.190–రూ.201గా నిర్ణయించింది. ఐపీఓ ఆగస్టు 17, 2026న ప్రారంభమై.. ఆగస్టు 19న ముగియనుంది. పెట్టుబడిదారులు కనీసం 74 షేర్ల లాట్కు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో షేర్ ముఖ విలువ రూ.5గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.1,200 కోట్ల వరకు తాజా షేర్లను జారీ చేయనుంది. మరోవైపు కంపెనీ ప్రమోటర్ ఎం.కిరణ్ కుమార్ జైన్ రూ.500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనున్నారు.
51 నగరాల్లో 61 స్టోర్లు
లలితా జ్యువెలరీ దక్షిణ భారతదేశంలో ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘Lalithaa’ బ్రాండ్ పేరుతో బంగారం, వెండి, వజ్రాభరణాలను విక్రయిస్తోంది. మార్చి 31, 2026 నాటికి కంపెనీకి 51 నగరాల్లో మొత్తం 61 స్టోర్లు ఉన్నాయి. ఇవి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిల్లో విస్తరించాయి. ఈ స్టోర్ల మొత్తం ఆపరేషనల్ ఏరియా సుమారు 6.50 లక్షల చదరపు అడుగులు. ముఖ్యంగా టియర్-2, టియర్-3 నగరాలపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. మొత్తం 61 స్టోర్లలో 45 స్టోర్లు చిన్న నగరాల్లోనే ఉన్నాయి. FY26లో ఈ స్టోర్ల ద్వారా కంపెనీ ఆదాయంలో సుమారు 60.25 శాతం వచ్చింది. లలితా జ్యువెలరీకి సొంతంగా ఆభరణాల తయారీ సామర్థ్యం కూడా ఉంది. తమిళనాడులో కంపెనీ రెండు తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. చెన్నైలోని తిరుముడివక్కంలో ఉన్న యూనిట్ 43,862 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మరో యూనిట్ కాంచీపురంలోని మరైమలైలో ఉంది. సొంత తయారీ కారణంగా పోటీ ధరలకు ఆభరణాలను అందించగలుగుతున్నామని కంపెనీ చెబుతోంది.
Also Read
- Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- India’s Richest Business Families: అదానీ నుంచి అంబానీ వరకు.. భారత బిజినెస్ ఫ్యామిలీల సంపద ఎంతో తెలుసా?
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
భారీగా పెరిగిన ఆదాయం, లాభం
కంపెనీ ఆర్థిక గణాంకాలు కూడా గణనీయమైన వృద్ధిని చూపిస్తున్నాయి. FY24లో రూ.16,788.05 కోట్లుగా ఉన్న ఆపరేషనల్ రెవెన్యూ.. FY26లో రూ.25,023.93 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నికర లాభం రూ.359.83 కోట్ల నుంచి రూ.1,009.82 కోట్లకు పెరిగింది. ఐపీఓలో నికర ఆఫర్లో గరిష్ఠంగా 50 శాతం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు (QIB), కనీసం 15 శాతం నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, కనీసం 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ లిమిటెడ్ (Anand Rathi Advisors), ఈక్విరస్ క్యాపిటల్ లిమిటెడ్ (Equirus Capital) లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా.. ఎంయూఎఫ్జీ ఇంటైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (MUFG Intime India) ఈ ఐపీఓకు రిజిస్ట్రార్గా ఉంది.
తాజావార్తలు
-
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
-
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్మన్ గిల్ వరకు ఇలా..
-
Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
-
Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులపై చర్యలకు వెనక్కి తగ్గిన బార్ కౌన్సిల్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!