JioCinema: జియో సినిమా బిగ్ డీల్.. ఇకపై హెచ్బీఓ , వార్నర్ బ్రదర్స్ కంటెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JioCinema: జియో సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ఫాంగా మార్చేందుకు రిలయన్స్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఐపీఎల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ గా ఉన్న జియో సినిమా ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. దీంతో రానున్న రోజుల్లో పెయిడ్ సబ్స్ట్రిప్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ మ్యాచులు మే 28తో ముగిసిన వెంటనే జియో సినిమా ఇకపై ఫ్రీగా వీక్షించే అవకాశం ఉండదని చెప్పకనే చెప్పింది. కొత్త కంటెంట్ ను యాడ్ చేయడంతో పాటు యూజర్లను ఆకర్షించేలా ప్లాన్స్ తీసుకువచ్చేందుకు సిద్ధం అయింది.
Read Also: The Kerala Story: ‘ది కశ్మీర్ ఫైల్స్’ తరహాలో మరో సినిమా! వివాదాల నీలినీడలు!!
Also Read
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
- UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
ఇదిలా ఉంటే ప్రస్తుతం జియో సినిమా భారీ డీల్ కుదుర్చుకుంది. హాలీవుడ్ కంటెంట్ అందించే వార్నర్ బ్రదర్స్, హెచ్బీఓ, డిస్కవరీతో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ బ్రాడ్కాస్ట్ వెంచర్, వయాకామ్ 18, దాని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియోసినిమాలో హాలీవుడ్ కంటెంట్ తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసమే ఈ భారీ ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వార్నర్ బ్రదర్స్ అలాగే దాని హెచ్బీఓ కంటెంట్ జియో సినిమా యాప్ లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన తుది వివరాలు పూర్తిగా తెరపైకి రాలేదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, లార్డ్ ఆఫ్ రింగ్స్, హ్యరీపోటర్ సీరిస్ వంటి హెచ్బీఓ కంటెంట్ ఇకపై జియో సినిమాలో అందుబాటులోకి వస్తుంది.
మార్చి 31న డిస్నీ హాట్స్టార్ నుంచి హెచ్బీఓ తమ కంటెంట్ ను తొలగించుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కు కూడా హెచ్బీఓ తమ కంటెంట్ ను ఇక మీదట ఇవ్వదని తెలుస్తోంది. భారతదేశంలో హెచ్బీఓకు కేరాఫ్ గా జియో సినిమా పనిచేయనుంది. హెచ్బీఓ సిరీస్, మ్యాక్స్ సిరీస్, వార్నర్ బ్రదర్స్ టెలివిజన్ సీరీస్లు యూఎస్ తో పాటు ఇండియాలో కూడా ఒకే రోజు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఇండియన్ ఓటీటీ మార్కెట్ లో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటివే అగ్రస్థానంలో ఉన్నాయి. జియో సినిమా త్వరలోనే కీలక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ గా ఎదగాలని అనుకుంటోంది.
తాజావార్తలు
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!