Jio Diwali Offer 2025: దీపావళికి జియో గోల్డెన్ ఆఫర్.. రూ.10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Diwali Offer 2025: దీపావళి పండుగకు జియో అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది. ఒకవేళ మీకు అదృష్టం ఉండి ఇది తగిలితే మీరు రూ.10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది. తాజాగా జియో ఫైనాన్స్ దీపావళికి పండుగ ఆఫర్ను ప్రకటించింది. మార్కెట్లో జియో గోల్డ్ 24కె డేస్ పేరుతో అందుబాటులో ఉంది. పండుగ సందర్భంగా బంగారం కొనుగోళ్లు జోరుగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ బంఫర్ ఆఫర్ను ప్రారంభించింది.
READ ALSO: Devi Sri Prasad: అంతమంది హీరోలు కాదన్న సినిమా ఎందుకు?
Also Read
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
- Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
- Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్గా థాయ్లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
- Govt Hikes Price: ఉల్లి రైతులకు భారీ శుభవార్త.. రైతుల పంట పండినట్లే..
ఆఫర్ ఏంటో తెలుసా..
కంపెనీ ప్లాట్ఫామ్ల నుంచి డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు ఈ ఆఫర్లను అందుకుంటారని జియో తెలిపింది. జియోఫైనాన్స్, మైజియో యాప్ల ద్వారా కస్టమర్లు డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇది పరిమిత కాలపు పండుగ ఆఫర్ అని చెప్పింది. అలాగే JioFinance లేదా MyJio యాప్ ద్వారా కొనుగోళ్లు చేస్తే 2% అదనపు బంగారం లభిస్తుందని పేర్కొంది. అలాగే కస్టమర్లకు అదనపు బహుమతులు కూడా ఉన్నాయని వెల్లడించింది.
రిలయన్స్ జియో ప్రకారం.. అక్టోబర్ 18 నుంచి 23 వరకు జియోఫైనాన్స్ యాప్ ద్వారా చేసే డిజిటల్ కొనుగోళ్లకు కస్టమర్లు బహుమతులు అందుకుంటారు. గోల్డ్ 24K డేస్ ఆఫర్ యాప్లో కనిపిస్తుంది. మీరు దాన్ని పొందవచ్చని చెప్పింది. జియోఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసే ప్రతి రూ.2 వేల విలువైన బంగారంపై 2% అదనపు బంగారం లభిస్తుందని కంపెనీ తెలిపింది. కొనుగోలు చేసిన 72 గంటల్లోపు ఇది వినియోగదారుడి గోల్డ్ వాలెట్కు జోడిస్తారని పేర్కొంది.
లక్కీ డ్రా ద్వారా విజేతలను నిర్ణయిస్తారని, కానీ రూ.20 వేలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే కస్టమర్లు మాత్రమే జియో గోల్డ్ మెగా ప్రైజ్ డ్రాలో పాల్గొనడానికి అర్హులు అని చెప్పింది. ఈ లక్కీ డ్రాలో కంపెనీ మొత్తం రూ.10 లక్షల బహుమతిని నిర్ణయించింది. అయితే రూ.10 లక్షలలో స్మార్ట్ఫోన్లు, టీవీలు, బంగారు నాణేలు, మిక్సర్ గ్రైండర్ల వరకు ప్రతిదీ ఉంటుంది. మీకు అదృష్టం ఉంటే పైన పేర్కొన్న బహుమతుల్లో డ్రాలో ఏదో ఒకటి గెలుచుకోవచ్చు. లక్కీ డ్రా ఫలితాలు అక్టోబర్ 27న ప్రకటిస్తారని కంపెనీ పేర్కొంది. అయితే దీపావళి సమయంలో లక్కీ డ్రాల గురించి అనేక నకిలీ సందేశాలు ఫోన్, ఇమెయిల్ ద్వారా కూడా వస్తాయని, లక్కీ డ్రాలో పాల్గొనే ముందు వాస్తవాలను తనిఖీ చేయాలని సూచించింది. కంపెనీ అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయకుండా లక్కీ డ్రా ద్వారా లేదా చౌక ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించవద్దని హెచ్చరించింది.
READ ALSO: X Mark On Train Coach: రైలు వెనుక “X” గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా!
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!