Jio Diwali Offer 2025: దీపావళికి జియో గోల్డెన్ ఆఫర్.. రూ.10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Diwali Offer 2025: దీపావళి పండుగకు జియో అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది. ఒకవేళ మీకు అదృష్టం ఉండి ఇది తగిలితే మీరు రూ.10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది. తాజాగా జియో ఫైనాన్స్ దీపావళికి పండుగ ఆఫర్ను ప్రకటించింది. మార్కెట్లో జియో గోల్డ్ 24కె డేస్ పేరుతో అందుబాటులో ఉంది. పండుగ సందర్భంగా బంగారం కొనుగోళ్లు జోరుగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ బంఫర్ ఆఫర్ను ప్రారంభించింది.
READ ALSO: Devi Sri Prasad: అంతమంది హీరోలు కాదన్న సినిమా ఎందుకు?
Also Read
- Memory Chip: చిప్ తయారీలో భారత్ సంచలనం.. కొత్త పెట్టుబడుల రాకపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Home Loan : హోమ్ లోన్ తీసుకుంటున్నారా ? ఈ పొరపాటును మాత్రం అస్సలు చేయకండి
- MRM Portal: MRM పోర్టల్ అంటే ఏమిటి? సైబర్ మోసంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఎలా పొందాలి?
- Senior Citizen Savings Scheme : సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా రూ. 20,000 వడ్డీ... ఏ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టాలంటే ?
ఆఫర్ ఏంటో తెలుసా..
కంపెనీ ప్లాట్ఫామ్ల నుంచి డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు ఈ ఆఫర్లను అందుకుంటారని జియో తెలిపింది. జియోఫైనాన్స్, మైజియో యాప్ల ద్వారా కస్టమర్లు డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇది పరిమిత కాలపు పండుగ ఆఫర్ అని చెప్పింది. అలాగే JioFinance లేదా MyJio యాప్ ద్వారా కొనుగోళ్లు చేస్తే 2% అదనపు బంగారం లభిస్తుందని పేర్కొంది. అలాగే కస్టమర్లకు అదనపు బహుమతులు కూడా ఉన్నాయని వెల్లడించింది.
రిలయన్స్ జియో ప్రకారం.. అక్టోబర్ 18 నుంచి 23 వరకు జియోఫైనాన్స్ యాప్ ద్వారా చేసే డిజిటల్ కొనుగోళ్లకు కస్టమర్లు బహుమతులు అందుకుంటారు. గోల్డ్ 24K డేస్ ఆఫర్ యాప్లో కనిపిస్తుంది. మీరు దాన్ని పొందవచ్చని చెప్పింది. జియోఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసే ప్రతి రూ.2 వేల విలువైన బంగారంపై 2% అదనపు బంగారం లభిస్తుందని కంపెనీ తెలిపింది. కొనుగోలు చేసిన 72 గంటల్లోపు ఇది వినియోగదారుడి గోల్డ్ వాలెట్కు జోడిస్తారని పేర్కొంది.
లక్కీ డ్రా ద్వారా విజేతలను నిర్ణయిస్తారని, కానీ రూ.20 వేలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే కస్టమర్లు మాత్రమే జియో గోల్డ్ మెగా ప్రైజ్ డ్రాలో పాల్గొనడానికి అర్హులు అని చెప్పింది. ఈ లక్కీ డ్రాలో కంపెనీ మొత్తం రూ.10 లక్షల బహుమతిని నిర్ణయించింది. అయితే రూ.10 లక్షలలో స్మార్ట్ఫోన్లు, టీవీలు, బంగారు నాణేలు, మిక్సర్ గ్రైండర్ల వరకు ప్రతిదీ ఉంటుంది. మీకు అదృష్టం ఉంటే పైన పేర్కొన్న బహుమతుల్లో డ్రాలో ఏదో ఒకటి గెలుచుకోవచ్చు. లక్కీ డ్రా ఫలితాలు అక్టోబర్ 27న ప్రకటిస్తారని కంపెనీ పేర్కొంది. అయితే దీపావళి సమయంలో లక్కీ డ్రాల గురించి అనేక నకిలీ సందేశాలు ఫోన్, ఇమెయిల్ ద్వారా కూడా వస్తాయని, లక్కీ డ్రాలో పాల్గొనే ముందు వాస్తవాలను తనిఖీ చేయాలని సూచించింది. కంపెనీ అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయకుండా లక్కీ డ్రా ద్వారా లేదా చౌక ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించవద్దని హెచ్చరించింది.
READ ALSO: X Mark On Train Coach: రైలు వెనుక “X” గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా!
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!