Sound Alert System: కేంద్రం సంచలన నిర్ణయం.. ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ ఉండాల్సిందే!
- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- ఈవీ వెహికిల్స్ కి సౌండ్ తప్పనిసరి చేసిన కేంద్రం..
- 2027 అక్టోబర్ 1 వరకు అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు AVAS..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sound Alert System: సాధారణంగా వాహనాలు రోడ్లపై ప్రయాణిస్తుంటే ఇంజిన్ శబ్దం వలన హారన్ కొట్టకపోయినా గుర్తించడం ఈజీ. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీ, మోటార్ ఆధారంగా నడవడంతో శబ్దం రాదు. ఫలితంగా వెనక నుంచి వెహికిల్స్ వస్తున్నా పాదచారులు లేదా ఇతర వాహనదారులు గుర్తించడం చాలా కష్టం అవుతుంది. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు వెహికల్ అలర్ట్ సిస్టంను తప్పనిసరి చేసింది.
Read Also: Traffic Challan : చెప్పులు వేసుకొని బైక్ నడిపితే జరిమానా..?
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
ఇక, 2027 అక్టోబర్ 1వ తేదీ నుంచి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు వెహికల్ అలర్ట్ సిస్టమ్ అమర్చడం తప్పనిసరి కానుంది. రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వశాఖ పేర్కొనింది. 2026 అక్టోబర్ 1వ తేదీ తర్వాత తయారయ్యే అన్ని కొత్త ఎలక్ట్రిక్ ప్యాసింజర్, గూడ్స్ వాహనాలు AVAS సౌకర్యంతోనే రోడ్లపైకి రావాలని మంత్రిత్వశాఖ రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా, వాహనాలు కదిలే సమయంలో ఈ సిస్టమ్ కృత్రిమ శబ్దాన్ని విడుదల చేస్తుంది. దీని వలన పాదచారులు, రోడ్డుపై ఉన్న ఇతర ప్రయాణికులు వాహనం వస్తోందని ముందుగానే గుర్తించే అవకాశం ఉంది. ఏఐఎస్-173 ప్రమాణాల ప్రకారం శబ్ద స్థాయిలతో ఈ సౌండ్ సిస్టమ్ ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుతం అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్లోని కొన్ని దేశాలు ఇప్పటికే హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలకు AVAS వినియోగాన్ని తప్పనిసరి చేశాయి. అలాగే, భారత్లో కూడా ఈ నిబంధన అమల్లోకి రానుంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!