Memory Chip: చిప్ తయారీలో భారత్ సంచలనం.. కొత్త పెట్టుబడుల రాకపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం సృష్టిస్తున్న డిమాండ్తో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన మెమరీ చిప్ల కొరతను అధిగమించడానికి భారతదేశం కీలక వేదికగా మారబోతోంది. దేశంలో ఈ విభాగానికి ఉన్న డిమాండ్-సప్లై వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు సరికొత్త అంతర్జాతీయ కంపెనీలు భారత మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని, అలాగే ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారులు కూడా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచనున్నారని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన దేశీయ సెమీకండక్టర్, డేటా సెంటర్ రంగాల భవిష్యత్తు రోడ్మ్యాప్ను పంచుకున్నారు.
భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా మార్చే లక్ష్యంతో రానున్న ‘ISM 2.0’ లో ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ‘ఇండియా సెమికాన్ మిషన్ 1.0’ లో ఇప్పటికే 48 స్టార్టప్లు సాంకేతిక ఉత్పత్తులపై విజయవంతంగా పనిచేశాయి. తదుపరి దశ (ISM 2.0) లో ‘చిప్ డిజైన్’ రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామన్నారు. సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన యంత్రాలను భారతదేశంలోనే డిజైన్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ చేసేలా అంతర్జాతీయ ఎక్విప్మెంట్ మేకర్లను ఆకర్షించడమే మా రెండో అతిపెద్ద లక్ష్యంగా పేర్కొన్నారు.
Also Read
- 15 నెలల వ్యాలిడిటీతో Jio 'Freedom Pack'.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
- IT Raid Rules: ఐటీ రైడ్ ఎప్పుడు జరుగుతుంది? ఏ తప్పులు ఆదాయపు పన్ను శాఖ మీ ఇంటికి రావడానికి కారణమవుతాయి?
- Debt Trap: అప్పు తీర్చడానికి మరో అప్పు.. EMI ట్రాప్లో మిడిల్క్లాస్ ఎలా చిక్కుకుంటోంది?
- Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ 'మనీ రూల్స్'.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
చిప్ తయారీ ప్రక్రియలో వాడే అత్యంత సంక్లిష్టమైన రసాయనాలు, గ్యాస్లను దేశీయంగానే ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. దీంతో పాటు మరిన్ని ఫ్యాబ్స్ (చిప్ ప్లాంట్లు), ATMP (ప్యాకేజింగ్) యూనిట్లను ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.
భారత్లో డేటా సెంటర్ పెట్టుబడులు త్వరలోనే 200 బిలియన్ డాలర్లను దాటనున్నాయి. దీనికి బిలియన్ల గిగాబైట్ల స్టోరేజ్ కెపాసిటీ అవసరమవుతుంది. AI డేటా సెంటర్లలో కీలకమైన ‘హై బ్యాండ్విడ్త్ మెమరీ చిప్స్’ కొరతను తీర్చడానికి మైక్రాన్ వంటి సంస్థలు ఇప్పటికే దేశంలో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయని మంత్రి గుర్తుచేశారు.
అంతర్జాతీయ హైపర్-స్కేలర్స్ భారత్ వైపు మొగ్గు చూపడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయని మంత్రి వివరించారు. భారతదేశంలో లభ్యమయ్యే నైపుణ్యం కలిగిన మానవ వనరులు, గత దశాబ్దంలో నిర్మించిన 2 లక్షల కిలోమీటర్ల సరికొత్త గ్రిడ్ వ్యవస్థ, దేశ మొత్తం విద్యుత్ సామర్థ్యంలో దాదాపు 50% పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే లభిస్తుండటం.
పర్యావరణ పరిరక్షణ
డేటా సెంటర్ల వల్ల పెరిగే విద్యుత్, నీటి వినియోగంపై పర్యావరణ ఆందోళనలు ఉన్నప్పటికీ, భారతదేశం అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. నీటి వినియోగాన్ని ఏకంగా 70 శాతం వరకు తగ్గించే సరికొత్త ‘వాటర్ కూలింగ్’ వంటి వినూత్న సాంకేతిక పద్ధతులను కంపెనీలు అవలంబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
SC Status: ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు క్లారిటీ.. రివ్యూ పిటిషన్కు నో చెప్పిన ధర్మాసనం.!
-
Abhishek vs Samson: అభిషేక్కు ఓ రూల్.. సంజుకు మరో రూలా.. బీసీసీఐపై తెలుగు ప్లేయర్ ఫైర్!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
CAT 2026 Notification: IIMల్లో MBA చదవాలనుకునే వారికి అలర్ట్.. CAT 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
ట్రెండింగ్
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!