India’s Manufacturing Sector Surges: చైనా ఆట ముగిసింది?.. తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్
- తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్
- చైనా దాటేసిందని తెలిసిన హెచ్ఎస్డీసీ నివేదిక
- భారత్లో తయారయ్యే వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్
- అధిక ఆర్డర్లను పొందుతున్న తయారీ రంగం
- ఉద్యోగులు సంఖ్య పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తయారీ రంగంలో గొప్పగా చెప్పుకునే చైనా ఇప్పుడు ఇందులో చాలా వెనుకబడిపోయింది. ఒకవైపు చైనా ఆర్థిక వృద్ధి చాలా నెమ్మదిగా ఉండగా.. భారత్కు శుభవార్త అందింది. హెచ్ఎస్డీసీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత్ యొక్క తయారీ రంగం అక్టోబర్లో విస్తరించింది. ఈ విషయంలో భారత్ చైనాను అధికమించిందని నివేదిక తెలిపింది. ఈ పెరుగుదలకు కారణం విదేశాల్లో భారత్ వస్తువులకు డిమాండ్ పెరిగింది. భారతదేశం ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కొత్త ఆర్డర్లను అందుకోవడమే కాకుండా అమ్మకాలు కూడా పెరిగాయి. దీంతో అక్టోబర్లో ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగింది. అక్టోబర్లో భారతదేశం ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, అమెరికా నుంచి మరిన్ని ఆర్డర్లను పొందింది. దీని కారణంగా తయారీ రంగం విజృంభించింది.
భారత్ పురోగతి?
అక్టోబర్లో ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 57.5 పాయింట్లకు పెరిగింది. ఇది సెప్టెంబర్లో 56.5 పాయింట్లు గా ఉండేది. పెరుగుతున్న పీఎమ్ఐ ఆపరేటింగ్ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయని హెచ్ఎస్డీసీ నివేదిక స్పష్టం చేస్తోంది. మరోవైపు చైనా పీఎంఐ 50.30 పాయింట్లుగా ఉంది. అయితే.. అక్టోబర్లో చైనా పీఎమ్ఐలో కొంత పెరుగుదల కనిపించింది. కానీ టోటల్ పాయింట్లలో భారత్ కంటే వెనుకబడి ఉంది.
Also Read
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
- Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
- Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
- Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
భారతదేశంలో తయారయ్యే వస్తువులకు డిమాండ్ ..
ఇటీవలి కాలంలో భారతదేశంలో తయారైన వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. చాలా విదేశీ కంపెనీలు భారీ సంఖ్యలో ఆర్డర్లను బుక్ చేసుకున్నాయి. ప్రస్తుత దశలో ఆర్డర్ల సంఖ్య గత 20 ఏళ్లలో వచ్చిన ఆర్డర్ల సగటు సంఖ్యను మించిపోయింది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, విజయవంతమైన మార్కెటింగ్ వస్తువుల అమ్మకాలను పెంచడంలో సహాయపడిందని నివేదిక పేర్కొంది.
ఉద్యోగుల సంఖ్య పెరుగుదల…
డిమాండ్ పెరగడంతో ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. అంటే ఉపాధి అవకాశాలు పెరిగాయి. తాజా డేటా ప్రకారం.. తయారీదారులు అక్టోబర్లో అదనపు ఉద్యోగులను నియమించుకున్నారు. ఈ సంఖ్య సెప్టెంబరులో కొత్తగా తీసుకున్న ఉద్యోగుల కంటే ఎక్కువ. అక్టోబర్ డేటా సేకరణ దాదాపు 20 ఏళ్లలో అత్యధికం. భవిష్యత్ ఉత్పత్తి వాల్యూమ్ల గురించి భారతీయ తయారీదారులు మరింత ఆశాజనకంగా మారారని హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!