India’s Manufacturing Sector Surges: చైనా ఆట ముగిసింది?.. తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్
- తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్
- చైనా దాటేసిందని తెలిసిన హెచ్ఎస్డీసీ నివేదిక
- భారత్లో తయారయ్యే వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్
- అధిక ఆర్డర్లను పొందుతున్న తయారీ రంగం
- ఉద్యోగులు సంఖ్య పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తయారీ రంగంలో గొప్పగా చెప్పుకునే చైనా ఇప్పుడు ఇందులో చాలా వెనుకబడిపోయింది. ఒకవైపు చైనా ఆర్థిక వృద్ధి చాలా నెమ్మదిగా ఉండగా.. భారత్కు శుభవార్త అందింది. హెచ్ఎస్డీసీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత్ యొక్క తయారీ రంగం అక్టోబర్లో విస్తరించింది. ఈ విషయంలో భారత్ చైనాను అధికమించిందని నివేదిక తెలిపింది. ఈ పెరుగుదలకు కారణం విదేశాల్లో భారత్ వస్తువులకు డిమాండ్ పెరిగింది. భారతదేశం ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కొత్త ఆర్డర్లను అందుకోవడమే కాకుండా అమ్మకాలు కూడా పెరిగాయి. దీంతో అక్టోబర్లో ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగింది. అక్టోబర్లో భారతదేశం ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, అమెరికా నుంచి మరిన్ని ఆర్డర్లను పొందింది. దీని కారణంగా తయారీ రంగం విజృంభించింది.
భారత్ పురోగతి?
అక్టోబర్లో ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 57.5 పాయింట్లకు పెరిగింది. ఇది సెప్టెంబర్లో 56.5 పాయింట్లు గా ఉండేది. పెరుగుతున్న పీఎమ్ఐ ఆపరేటింగ్ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయని హెచ్ఎస్డీసీ నివేదిక స్పష్టం చేస్తోంది. మరోవైపు చైనా పీఎంఐ 50.30 పాయింట్లుగా ఉంది. అయితే.. అక్టోబర్లో చైనా పీఎమ్ఐలో కొంత పెరుగుదల కనిపించింది. కానీ టోటల్ పాయింట్లలో భారత్ కంటే వెనుకబడి ఉంది.
Also Read
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
భారతదేశంలో తయారయ్యే వస్తువులకు డిమాండ్ ..
ఇటీవలి కాలంలో భారతదేశంలో తయారైన వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. చాలా విదేశీ కంపెనీలు భారీ సంఖ్యలో ఆర్డర్లను బుక్ చేసుకున్నాయి. ప్రస్తుత దశలో ఆర్డర్ల సంఖ్య గత 20 ఏళ్లలో వచ్చిన ఆర్డర్ల సగటు సంఖ్యను మించిపోయింది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, విజయవంతమైన మార్కెటింగ్ వస్తువుల అమ్మకాలను పెంచడంలో సహాయపడిందని నివేదిక పేర్కొంది.
ఉద్యోగుల సంఖ్య పెరుగుదల…
డిమాండ్ పెరగడంతో ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. అంటే ఉపాధి అవకాశాలు పెరిగాయి. తాజా డేటా ప్రకారం.. తయారీదారులు అక్టోబర్లో అదనపు ఉద్యోగులను నియమించుకున్నారు. ఈ సంఖ్య సెప్టెంబరులో కొత్తగా తీసుకున్న ఉద్యోగుల కంటే ఎక్కువ. అక్టోబర్ డేటా సేకరణ దాదాపు 20 ఏళ్లలో అత్యధికం. భవిష్యత్ ఉత్పత్తి వాల్యూమ్ల గురించి భారతీయ తయారీదారులు మరింత ఆశాజనకంగా మారారని హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
-
Team India Selection: బీసీసీఐ కీలక మీటింగ్.. యువ పేసర్లకు ఛాన్స్, సీనియర్లకు షాక్ తప్పదా?
-
KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్కు చావోరేవో.. ప్లేఆఫ్స్కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!