India’s Manufacturing Sector Surges: చైనా ఆట ముగిసింది?.. తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్
- తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్
- చైనా దాటేసిందని తెలిసిన హెచ్ఎస్డీసీ నివేదిక
- భారత్లో తయారయ్యే వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్
- అధిక ఆర్డర్లను పొందుతున్న తయారీ రంగం
- ఉద్యోగులు సంఖ్య పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తయారీ రంగంలో గొప్పగా చెప్పుకునే చైనా ఇప్పుడు ఇందులో చాలా వెనుకబడిపోయింది. ఒకవైపు చైనా ఆర్థిక వృద్ధి చాలా నెమ్మదిగా ఉండగా.. భారత్కు శుభవార్త అందింది. హెచ్ఎస్డీసీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత్ యొక్క తయారీ రంగం అక్టోబర్లో విస్తరించింది. ఈ విషయంలో భారత్ చైనాను అధికమించిందని నివేదిక తెలిపింది. ఈ పెరుగుదలకు కారణం విదేశాల్లో భారత్ వస్తువులకు డిమాండ్ పెరిగింది. భారతదేశం ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కొత్త ఆర్డర్లను అందుకోవడమే కాకుండా అమ్మకాలు కూడా పెరిగాయి. దీంతో అక్టోబర్లో ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగింది. అక్టోబర్లో భారతదేశం ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, అమెరికా నుంచి మరిన్ని ఆర్డర్లను పొందింది. దీని కారణంగా తయారీ రంగం విజృంభించింది.
భారత్ పురోగతి?
అక్టోబర్లో ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 57.5 పాయింట్లకు పెరిగింది. ఇది సెప్టెంబర్లో 56.5 పాయింట్లు గా ఉండేది. పెరుగుతున్న పీఎమ్ఐ ఆపరేటింగ్ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయని హెచ్ఎస్డీసీ నివేదిక స్పష్టం చేస్తోంది. మరోవైపు చైనా పీఎంఐ 50.30 పాయింట్లుగా ఉంది. అయితే.. అక్టోబర్లో చైనా పీఎమ్ఐలో కొంత పెరుగుదల కనిపించింది. కానీ టోటల్ పాయింట్లలో భారత్ కంటే వెనుకబడి ఉంది.
Also Read
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
భారతదేశంలో తయారయ్యే వస్తువులకు డిమాండ్ ..
ఇటీవలి కాలంలో భారతదేశంలో తయారైన వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. చాలా విదేశీ కంపెనీలు భారీ సంఖ్యలో ఆర్డర్లను బుక్ చేసుకున్నాయి. ప్రస్తుత దశలో ఆర్డర్ల సంఖ్య గత 20 ఏళ్లలో వచ్చిన ఆర్డర్ల సగటు సంఖ్యను మించిపోయింది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, విజయవంతమైన మార్కెటింగ్ వస్తువుల అమ్మకాలను పెంచడంలో సహాయపడిందని నివేదిక పేర్కొంది.
ఉద్యోగుల సంఖ్య పెరుగుదల…
డిమాండ్ పెరగడంతో ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. అంటే ఉపాధి అవకాశాలు పెరిగాయి. తాజా డేటా ప్రకారం.. తయారీదారులు అక్టోబర్లో అదనపు ఉద్యోగులను నియమించుకున్నారు. ఈ సంఖ్య సెప్టెంబరులో కొత్తగా తీసుకున్న ఉద్యోగుల కంటే ఎక్కువ. అక్టోబర్ డేటా సేకరణ దాదాపు 20 ఏళ్లలో అత్యధికం. భవిష్యత్ ఉత్పత్తి వాల్యూమ్ల గురించి భారతీయ తయారీదారులు మరింత ఆశాజనకంగా మారారని హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
-
Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భారీ ప్రక్షాళన!
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
-
ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!